Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోదీతో జగన్ భేటీ.. నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే?

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (11:35 IST)
ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చ జరిపారు. ప్రధాని నివాసంలో ఈ కీలక సమావేశం జరిగింది.  
 
పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్‌ ప్లాంట్, జాతీయ ఆహార భద్రతా చట్టం అర్హుల ఎంపికలో హేతుబద్ధత, తెలంగాణ డిస్కంల నుంచి రాష్ట్రానికి బకాయిలు తదితర అంశాలపై ప్రధాన మంత్రికి ఏపీ సీఎం జగన్ వినతిపత్రం అందజేశారు.
 
సుమారు గంటకుపైగా జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నివేదించిన అంశాలపట్ల ప్రధాని సానుకూలంగా స్పందించారు.
 
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మధ్య ఎలాంటి రిలేషన్‌‌ ఉంటుందో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రా ప్రజలకు వివరించారు. జగన్‌మోహన్ రెడ్డి అంటే ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక అభిమానమని.. ఎప్పుడు కనిపించినా ఒక తండ్రిలా ఆప్యాయంగా పలకరిస్తారన్నారు.  
 
నాసిన్ ఏర్పాటుపై కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. 2024 నాటికి నాసిన్ పనులు పూర్తి చేస్తామన్నారు. నాసిన్ ఏర్పాటుకు సహకరిస్తున్న ఏపీ ప్రభుత్వానికి.. భూములిచ్చిన రెండు గ్రామాల రైతులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. 
 
అకాడమీ ఏర్పాటుతో పాలసముద్రం, హిందూపురం ప్రాంతాల్లో మరింత అభివృద్ధి జరుగుతుందని కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. పాలసముద్రం గ్రామానికి రూ.729 కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments