Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటరిగా వదిలి వెళ్ళిపోయావా అంజలీ.. లేచి నన్ను చూడు అంజలీ...

Webdunia
సోమవారం, 8 జులై 2019 (16:46 IST)
కాళ్ళపారాణి ఆరకముందే ఓ నవవధువు మృత్యుఒడిలోకి చేరుకుంది. భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈమె చనిపోగా, భర్త గాయపడ్డాడు. ఈ హృదయ విదాకర ఘటన అనంతపురం జిల్లా హిందూపురం అర్బన్ ఏరియాలో జరిగింది.
 
ఈ ప్రమాద వార్తపై పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... మడకశిర మండలం సీరాయపురానికి చెందిన పవన్‌కుమార్‌, అంజలీ హిందూపురంలోని కొటిపి లయోల పాఠశాలలో చదువుతున్న పవన్‌ సోదరుడిని చూసేందుకు ద్విచక్రవాహనంపై వచ్చారు. 
 
అతన్ని చూసిన తర్వాత తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో పరిగి రోడ్డు కట్టకాలువ వద్ద హిందూపురం వైపు నుంచి మడకశిర వైపు వెళ్తుండగా వెనకాల నుంచి తమిళనాడుకు చెందినలారీ ఢీకొంది. దీంతో దంపతులిద్దరు కిందపడ్డారు. అయితే, అంజలి లారీ వెనుక చక్రాల కింద పడిపోయింది. దీంతో ఆమెపై లారీ ఎక్కడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆ తర్వాత స్థానికులు గుర్తించి ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటికే కన్నుమూసింది. 
 
తన కళ్ల ముందే కట్టుకున్న భార్య మృతిచెందడంతో భర్త పవన్‌ కుమార్‌ రోదించిన తీరు వర్ణనాతీతం. తనను ఒంటరిగా వది వెళ్లిపోయావా.. లేచి నన్ను చూడు అంజలీ.. దేవుడా నన్నుకూడా తీసుకుపో.. అంటూ రోధించాడు. అతన్ని చూసిన ప్రతి ఒక్కరూ కంట కన్నీరు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments