Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటరిగా వదిలి వెళ్ళిపోయావా అంజలీ.. లేచి నన్ను చూడు అంజలీ...

Webdunia
సోమవారం, 8 జులై 2019 (16:46 IST)
కాళ్ళపారాణి ఆరకముందే ఓ నవవధువు మృత్యుఒడిలోకి చేరుకుంది. భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈమె చనిపోగా, భర్త గాయపడ్డాడు. ఈ హృదయ విదాకర ఘటన అనంతపురం జిల్లా హిందూపురం అర్బన్ ఏరియాలో జరిగింది.
 
ఈ ప్రమాద వార్తపై పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... మడకశిర మండలం సీరాయపురానికి చెందిన పవన్‌కుమార్‌, అంజలీ హిందూపురంలోని కొటిపి లయోల పాఠశాలలో చదువుతున్న పవన్‌ సోదరుడిని చూసేందుకు ద్విచక్రవాహనంపై వచ్చారు. 
 
అతన్ని చూసిన తర్వాత తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో పరిగి రోడ్డు కట్టకాలువ వద్ద హిందూపురం వైపు నుంచి మడకశిర వైపు వెళ్తుండగా వెనకాల నుంచి తమిళనాడుకు చెందినలారీ ఢీకొంది. దీంతో దంపతులిద్దరు కిందపడ్డారు. అయితే, అంజలి లారీ వెనుక చక్రాల కింద పడిపోయింది. దీంతో ఆమెపై లారీ ఎక్కడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆ తర్వాత స్థానికులు గుర్తించి ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటికే కన్నుమూసింది. 
 
తన కళ్ల ముందే కట్టుకున్న భార్య మృతిచెందడంతో భర్త పవన్‌ కుమార్‌ రోదించిన తీరు వర్ణనాతీతం. తనను ఒంటరిగా వది వెళ్లిపోయావా.. లేచి నన్ను చూడు అంజలీ.. దేవుడా నన్నుకూడా తీసుకుపో.. అంటూ రోధించాడు. అతన్ని చూసిన ప్రతి ఒక్కరూ కంట కన్నీరు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments