Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమలం గూటికి ఆనంద్ శర్మ? పుకార్లేనంటున్న కాంగ్రెస్ నేత!

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (10:51 IST)
దేశంలో కాంగ్రెస్ పార్టీ తన ప్రాభవాన్ని క్రమంగా కోల్పోతోంది. దీంతో ఆ పార్టీకి చెందిన దిగ్గజ నేతలు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు కాషాయం పార్టీలో చేరిపోయారు. తాజాగా మరో సీనియర్ నేత ఆనంద్ శర్మ కూడా కమలం గూటికి వెళ్ళనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
ఈ వార్తలకు బలం చేకూర్చేలా ఆయన తాజాగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. దీంతో ఆనంద్ శర్మ ఇక కమలం పార్టీలో చేరడమే మిగిలివుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా మరికొన్ని నెలల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆనంద్ శర్మ, జేపీ నడ్డాల మధ్య జరిగిన భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. 
 
మరోవైపు, తాను పార్టీ మారుతున్నట్టు సాగుతున్న ప్రచారాన్ని ఆనంద్ శర్మ ఖండించారు. ఎప్పటికీ తాను కాంగ్రెస్ పార్టీ వాదినేనని చెప్పారు. పైగా, జేపీ నడ్డాను కలవడం తన హక్కు అని, తామిద్దరం ఒకే రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నామని గుర్తుచేశారు. ఏది ఏమైనా కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీకి దూరమైపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments