Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీకి మరో షాక్... ఆనంద్ శర్మ రాజీనామా

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (08:13 IST)
కాంగ్రెస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఒక్కొక్కరు మెల్లగా జారుకుంటున్నారు. ఇప్పటికే సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ జమ్మూకాశ్మీర్ ప్రచార కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఇపుడు ఇదే బాటలో మరో సీనియర్ నేత ఆనంద్ శర్మ కూడా రాజీనామా చేశారు. హిమాచల్ ప్రదేశ్ పీసీసీ స్టీరింగ్ సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. 
 
తనను పిలవకుండానే, కనీసం సంప్రదించకుండానే స్టీరింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయని ఆనంద్ శర్మ తన లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో తన ఆత్మగౌరవం దెబ్బతిందని, ఆత్మగౌరవంపై రాజీపడే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. అయితే, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల తరపున తాను ప్రచారం చేస్తానని హామీ ఇచ్చారు. 
 
కాగా, 1982లో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసిన ఆనంద్ శర్మను నాటి ప్రధాని ఇందిరాగాంధీ 1984లో రాజ్యసభకు  పంపారు. అప్పటి నుంచి మొన్నటివరకు ఆయన రాజ్యసభ సభ్యుడిగానే కొనసాగారు. పార్టీలో కీలక నేతగా ఎదిగారు. పలు కీలక బాధ్యతలను నిర్వహించారు. పలు శాఖలకు కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments