Webdunia - Bharat's app for daily news and videos

Install App

విలువైన అంశాల జాబితాలో బార్బర్‌కు అగ్రస్థానం : ఆనంద్ మహీంద్రా

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (20:14 IST)
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే దేశ పారిశ్రామికవేత్తల్లో మహీంద్రా గ్రూపు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఒకరు. ఈయన దేశంలో ఎక్కడైనా హృదయాన్ని కలిగించే సంఘటన జరిగితే దాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తుంటారు. అలాగే, ఆపదలో ఉన్న ఎంతో మందిని ఆదుకున్నారు. ఇపుడు కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఫలితంగా అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 
 
ఈ సేవల్లో విలువైనవి ఏవి అనే అంశంపై ఆనంద్ మహీంద్రా స్పందించారు. మనం సుఖంగా జీవించడానికి అవసరమైన నిత్యావసర అంశాలు చాలా తక్కువ అని ఈ లాక్‌డౌన్ మనకు తెలియజెప్పిందని పేర్కొన్నారు. "ఈ సందర్భంగా విలువైన అంశాల జాబితాలో నేను నా క్షురకుడికి తిరుగులేని అగ్రస్థానం ఇస్తాను. ఎందుకంటే, లాక్‌డౌన్ కారణంగా నా జుత్తును నేనే ఎలా కత్తిరించుకోవాలి అనే అంశం తప్పనిసరిగా నేర్చుకోవాల్సి వచ్చింది. చాలావరకు ఈ విద్యను నేర్చుకున్నాననే భావిస్తున్నాను" అని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments