ఢిల్లీలో రోటీలు అమ్ముతున్న కుర్రోడు... కాంటాక్ట్ నంబర్ కావాలంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్

ఠాగూర్
సోమవారం, 6 మే 2024 (19:46 IST)
ఢిల్లీలో రోటీలు విక్రయిస్తున్న కుర్రాడి వీడియోను దేశ పారిశ్రామికదిగ్గజం ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ఆ వీడియోలోని కుర్రాడి కాంటాక్ట్ నంబర్ కావాలంటూ ట్వీట్ చేశారు. ఆ కుర్రోడికి సాయం చేస్తానంటూ ముందుకు వచ్చారు. అతని చదువులకు ఆటంకం కలగకుండా మహీంద్రా ఫౌండేషన్ సాయం చేస్తుందంటూ ట్వీట్ చేశారు. 
 
ఆనంద్ మహీంద్రా ఓ వీడియో షేర్ చేశారు. ఇందులో దేశ రాజధాని ఢిల్లీలో పదేళ్ల జస్ప్రీత్ అనే కుర్రోడు రోటీలు చేసి అమ్ముకోవడం చూడొచ్చు. మెదడు కేన్సర్ వల్ల తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలు పసివాడిపై పడ్డాయి. అతనికి ఓ అక్క కూడా ఉంది. తల్లి తమను వదిలేసి వెళ్లిపోవడంతో ఉదయం పాఠశాలకు వెళ్లి సాయంకాలం ఇలా ఫుడ్ బిజినెస్ చేస్తున్నాడు. ఈ వీడియో చూసి చలించిపోయిన ఆనంద్ మహీంద్రా... ఆ బాలుడి వివరాలు కావాలంటూ ట్వీట్ చేశారు. 
 
"నాకు తెలిసి అది ఢిల్లీలోని తిలక్ నగర్ అనుకుంటా. మీలో ఎవరికైనా జస్ప్రీత్ కాంటాక్ట్ నంబర్ తెలిస్తే షేర్ చేయండి. అతని చదువు పాడవుకూడదు. మహీంద్రా ఫౌండేషన్ టీమ్ అతనికి ఎలా చదువుపరంగా సాయం చేస్తుందనేది వివరిస్తుంది" అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇపుడు ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. మరోమారు ఆనంద్ మహీంద్రా మంచి మనసుకు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments