Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లాస్ రూమ్ లోనే బాలిక మృతి.. చలి తీవ్రత కారణంగా గుండెపోటు?

Webdunia
శుక్రవారం, 20 జనవరి 2023 (13:20 IST)
రాజ్ కోట్ లో తరగతి లోనే బాలిక మృతి చెందింది. చలి తీవ్రత కారణంగా రాజ్ కోట్ లో బాలిక ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. 14 ఏళ్ల రియా సాగర్, రాజ్ కోట్ లోని గొండాల్ రోడ్ లో వున్న ప్రైవేట్ స్కూలులో 8వ తరగతి చదువుతుంది. మంగళవారం ఉదయం ఏడు గంటలకు స్కూలుకు వెళ్లింది. 
 
ప్రేయర్ తర్వాత క్లాస్ రూముకు వెళ్లింది. స్కూల్ సిబ్బంది వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించారు. అయితే విద్యార్థిని అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో స్కూల్ సిబ్బంది బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. 
 
చలి కారణంగానే తన కుమార్తె మరణించిందని.. రియాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని విద్యార్థిని తల్లి జానకి తెలిపింది. తీవ్రమైన చలి ఉన్నప్పటికీ పిల్లలను ఉదయాన్నే స్కూల్‌కు రప్పిస్తున్నారని విమర్శించింది. ఈ నేపథ్యంలో శరీరంలోని రక్తం గడ్డకట్టడంతో తన కుమార్తె కుప్పకూలి చనిపోయినట్లు తల్లి జానకి తెలిపింది.
 
అయితే విద్యార్థిని రియా తల్లి వ్యాఖ్యలను పోలీసులు ఖండించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వచ్చిన తర్వాతే ఆ బాలిక మరణానికి కారణం తెలియవస్తుందని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments