క్లాస్ రూమ్ లోనే బాలిక మృతి.. చలి తీవ్రత కారణంగా గుండెపోటు?

Webdunia
శుక్రవారం, 20 జనవరి 2023 (13:20 IST)
రాజ్ కోట్ లో తరగతి లోనే బాలిక మృతి చెందింది. చలి తీవ్రత కారణంగా రాజ్ కోట్ లో బాలిక ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. 14 ఏళ్ల రియా సాగర్, రాజ్ కోట్ లోని గొండాల్ రోడ్ లో వున్న ప్రైవేట్ స్కూలులో 8వ తరగతి చదువుతుంది. మంగళవారం ఉదయం ఏడు గంటలకు స్కూలుకు వెళ్లింది. 
 
ప్రేయర్ తర్వాత క్లాస్ రూముకు వెళ్లింది. స్కూల్ సిబ్బంది వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించారు. అయితే విద్యార్థిని అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో స్కూల్ సిబ్బంది బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. 
 
చలి కారణంగానే తన కుమార్తె మరణించిందని.. రియాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని విద్యార్థిని తల్లి జానకి తెలిపింది. తీవ్రమైన చలి ఉన్నప్పటికీ పిల్లలను ఉదయాన్నే స్కూల్‌కు రప్పిస్తున్నారని విమర్శించింది. ఈ నేపథ్యంలో శరీరంలోని రక్తం గడ్డకట్టడంతో తన కుమార్తె కుప్పకూలి చనిపోయినట్లు తల్లి జానకి తెలిపింది.
 
అయితే విద్యార్థిని రియా తల్లి వ్యాఖ్యలను పోలీసులు ఖండించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వచ్చిన తర్వాతే ఆ బాలిక మరణానికి కారణం తెలియవస్తుందని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil: దీపావళి శుభాకాంక్షలతో అక్కినేని అఖిల్, జైనాబ్ రవ్జీ

James Cameron : జేమ్స్ కామెరూన్.. అవతార్: ఫైర్ అండ్ యాష్.. కోసం భారతదేశంలో ఈవెంట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments