Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ చీఫ్‌ అమిత్ షా సభకు జనాలు కరువు

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (13:29 IST)
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అగ్రనేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా, ప్రధాని నరేంద్ర మోడీ, బీజీపీ చీఫ్ అమిత్ షా‌లు దేశ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు జరుపుతున్నారు. అలాగే, మిగిలిన అగ్రనేతలు కూడా క్షణం తీరిక లేకుండా ప్రచారంలో ఉన్నారు. 
 
అయితే, బీజేపీ చీఫ్ అమిత్ షా గుజరాత్ రాష్ట్రంలోని గాంధీ నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన శనివారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభ జనాలు లేక వెలవెలబోయింది. 
 
సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. అమిత్ షా పాల్గొనే సభకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో అతిపెద్ద జాతీయ పార్టీ అయిన బీజేపీ జాతీయ అధ్యక్షుడి ప్రసంగం వినేందుకు ఖాళీ కుర్చీలు ఉన్నాయి అంటూ సుహానా ఖురేషీ అనే నెటిజన్ వీడియో పోస్ట్ చేసి ట్వీట్ చేశారు. 

 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments