Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప జిల్లాలో టీడీపీకి షాక్.. రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (13:04 IST)
ఎన్నికల పోలింగ్ సమీపిస్తోంది. అయినప్పటికీ అధికార విపక్ష పార్టీల్లో జంపింగ్‌లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అధికార తెలుగుదేశం పార్టీకి కడప జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కేంద్ర మాజీమంత్రి సాయిప్రతాప్ టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 
 
ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించి, గత యూపీఏ 2 ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌ రెడ్డికి బాగా సన్నిహితుడు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కనుమరుగై పోవడంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. 
 
అయితే, ఆయన అక్కడ కూడా ఇమడలేక పోయారు. ఓ సమయంలో ఆయన వైఎస్ జగన్‌ను డైనమిక్ లీడరంటూ ప్రశంసించారు. నిత్యం జనాల్లో ఉండేందుకే జగన్ భారీ ప్రణాళికలు రూంపొందించుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. అయితే, శుక్రవారం టీడీపీకి రాజీనామా చేసిన సాయిప్రతాప్.. ఇక త్వరలోనే వైసీపీలో చేరడం ఖాయమంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments