Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప జిల్లాలో టీడీపీకి షాక్.. రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (13:04 IST)
ఎన్నికల పోలింగ్ సమీపిస్తోంది. అయినప్పటికీ అధికార విపక్ష పార్టీల్లో జంపింగ్‌లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అధికార తెలుగుదేశం పార్టీకి కడప జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కేంద్ర మాజీమంత్రి సాయిప్రతాప్ టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 
 
ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించి, గత యూపీఏ 2 ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌ రెడ్డికి బాగా సన్నిహితుడు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కనుమరుగై పోవడంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. 
 
అయితే, ఆయన అక్కడ కూడా ఇమడలేక పోయారు. ఓ సమయంలో ఆయన వైఎస్ జగన్‌ను డైనమిక్ లీడరంటూ ప్రశంసించారు. నిత్యం జనాల్లో ఉండేందుకే జగన్ భారీ ప్రణాళికలు రూంపొందించుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. అయితే, శుక్రవారం టీడీపీకి రాజీనామా చేసిన సాయిప్రతాప్.. ఇక త్వరలోనే వైసీపీలో చేరడం ఖాయమంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kantara Chapter 1: కాంతార చాప్టర్‌ 1.. రిషబ్ శెట్టి సతీమణి కన్నీళ్లు.. తారక్‌తో రిషబ్ ఫ్యామిలీ వీడియో వైరల్

Pawan Kalyan: దయచేసి సినిమాను చంపకండి, ఒకరినొకరు అభినందించుకోండి.. ఫ్యాన్స్‌కు పవన్ హితవు

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments