Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినీతిపై విచారణ? ఎందుకు?.. ఆధారాలుంటే కోర్టుకెళ్లొచ్చు : అమిత్ షా

తన కుమారుడు జయ్ షా అవినీతికి పాల్పడినట్టు వస్తున్న వార్తలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పందించారు. అహ్మదాబాద్‌లో ఓ టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తన కుమారుడు జయ్ షా సారథ్యం

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2017 (15:02 IST)
తన కుమారుడు జయ్ షా అవినీతికి పాల్పడినట్టు వస్తున్న వార్తలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పందించారు. అహ్మదాబాద్‌లో ఓ టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తన కుమారుడు జయ్ షా సారథ్యంలోని కంపెనీ ఎలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టంచేశారు.
 
ముఖ్యంగా కంపెనీ టర్నోవర్, లాభనష్టాల్లో తేడాలు ఉంటాయన్నారు. పైగా, ప్రభుత్వం నుంచి సెంటు భూమి లేదా ఎలాంటి రుణాలు తీసుకోలేదని తేల్చి చెప్పారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే కోర్టుకెళ్లవచ్చని ఆయన సలహా ఇచ్చారు.
 
పైగా, ఈ అంశంపై తన కుమారుడు స్వయంగా విచారణకు ముందుకు వచ్చారని, రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారని అమిత్‌ షా గుర్తుచేశారు. కాగా, గత మూడేళ్ళ కాలంలో కంపెనీ టర్నోవర్ రూ.50 వేల నుంచి 80 కోట్లకు చేరుకుందని 'ది వైర్‌' పోర్టల్ ఓ కథనాన్ని ప్రచురించగా, ఇది సంచలనమైన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments