Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిత్యానంద మృతి వార్తలు - వాస్తవం ఏంటి? కైలాసం నుంచి అధికార ప్రకటన!

ఠాగూర్
బుధవారం, 2 ఏప్రియల్ 2025 (12:19 IST)
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మృతి చెందారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. హిందూ ధర్మ పరిరక్షణ కోసం తన ప్రాణాలు త్యాగం చేశాడంటూ, నిత్యానంద మేనల్లుడు సుందరేశ్వరన్ తమిళ మీడియాతో చెప్పిన వ్యాఖ్యలు ఈ వార్తలు మరింత ఊపునిచ్చాయి. అయితే, వార్తలపై కైలాస దేశం నుంచి అధికారక ప్రకటన విడుదలైంది. 
 
తన మృతిపై వస్తున్న వదంతులను ఖండించిన నిత్యానంద, తాను పూర్తి సురక్షితంగా ఉన్నానని, జీవ సమాధిలో ఉన్నానని ప్రకటించారు. ఈ ప్రకటనతో ఆయన భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. నిత్యానంద ప్రస్తుతం తన సొంత దీపం కైలాసలో ఉంటూ, తన ధార్మిక కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్టు సమాచారం. 
 
2022లోనూ నిత్యానంద మృతి చెందారని వస్తున్న వార్తలను ఆయన స్వయంగా ఖండించారు. తాను చనిపోలేదని, జీవ సమాధిలో ఉన్నానని  ప్రకటించారు. ఇక ఆయన చివరిసారిగా 2022 మహాశివరాత్రి రోజున యూట్యూబ్‌లో ప్రత్యక్షమయ్యారు. 
 
తాజా పరిణామాల నేపథ్యంలో నిత్యానంద భక్తులకు ఓ ప్రకటన విడుదల చేయడం ద్వారా వారి ఆందోళన తొలగించారని చెప్పవచ్చు. ఆయన ఆరోగ్యంగా కైలసంలో ఉంటూ తన మిషన్‌ను కొనసాగిస్తున్నట్టు స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments