Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు కేంద్ర మంత్రివర్గం అత్యవసర సమావేశం : మళ్లీ లాక్డౌన్?

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (08:01 IST)
దేశంలో ఒమిక్రాన్ వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో కేంద్రమంత్రివర్గం గురువారం అత్యవసరంగా సమావేశంకానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ జరుగనుంది. ఇందులో మళ్లీ దేశంలో లాక్డౌన్ విధించే అంశాన్ని పరిశీలించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
 
సౌతాఫ్రికాలో పురుడు పోసుకున్న ఒమిక్రాన్ వైరస్ ఇపుడు ప్రపంచ దేశాలను వణికిస్తుంది. అలాగే, భారత్‌లోని పలు రాష్ట్రాల్లో కూడా ఈ కేసులు నమోదవుతున్నాయి. ఇది తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. 
 
ముఖ్యంగా కరోనా మొదటి, రెండో వేవ్ సృష్టించిన నష్టం నుంచి ఇప్పుడిపుడే కోలుకుంటుంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై చర్చించేందుకు మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశమవుతుంది. 
 
గురువారం ఉదయానికి దేశవ్యాప్తంగా 213 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 15 రాష్ట్రాలకు ఈ వైరస్ వ్యాపించింది. దేశ రాజధాని ఢిల్లీలో 57 కేసులు నమోదుకాగా, మహారాష్ట్రలో 54, తెలంగాణాలో 24, కర్నాటకలో 19, రాజస్థాన్‌లో 19, కేరళలో 15, గుజరాత్‌లో 14 ఇలా మొత్తం 15 రాష్ట్రాల్లో 213 ఒమిక్రాన్ కేసులు నమోదైవున్నాయి. ఈ వైరస్ సోకినవారిలో 90 మంది ఇప్పటివరకు కోలుకున్నట్టు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments