Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులూ.. మీరు ఎలాగైనాపోండి... మా జీతాలు 100 శాతం పెంచుకుంటున్నాం...

దేశంలో తమిళనాడు రూటే సెపరేటు. ఒకవైపు తమిళ రైతులు నెలల తరబడి దేశ రాజధానిలో ఆందోళన కార్యక్రమాలు, నిరసన ప్రదర్శనలు చేస్తుంటే మరోవైపు తమిళనాడు శాసనసభ సభ్యులు తమకు జీతాలు తక్కువ అని ఫీలైనట్లున్నారు. వెంటనే

Webdunia
బుధవారం, 19 జులై 2017 (16:08 IST)
దేశంలో తమిళనాడు రూటే సెపరేటు. ఒకవైపు తమిళ రైతులు నెలల తరబడి దేశ రాజధానిలో ఆందోళన కార్యక్రమాలు, నిరసన ప్రదర్శనలు చేస్తుంటే మరోవైపు తమిళనాడు శాసనసభ సభ్యులు తమకు జీతాలు తక్కువ అని ఫీలైనట్లున్నారు. వెంటనే తమ జీతాలను భారీగా పెంచుకున్నారు.
 
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పళనిస్వామి శాసనసభలో బుధవారం చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే జీతం రూ.55 వేలు ఉండగా దాన్ని అమాంతం రూ.1.05 లక్షలకు పెంచారు. అంటే పెరుగుదల వందశాతమన్నమాట. అలాగే ఎమ్మెల్యేల ఫింఛను రూ.12 వేల నుండి రూ.20 వేలకు పెంచారు.
 
ప్రతిపక్షాలు అన్నీ ఈ విషయంలో ఏకాభిప్రాయంతో ఏమాత్రం అడ్డు చెప్పకుండా సమర్థించడం విశేషం. దీనిపై రైతు సంఘాలు భగ్గుమన్నాయి. శాసనసభ సభ్యులు తాము చేస్తున్న ఆందోళనలను ఏమాత్రం పట్టించుకోకపోగా, భారీ మొత్తంలో తమ జీతాలను పెంచుకోవడం చాలా బాధాకరమే కాదు.. సిగ్గు చేటని వాపోతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments