Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర్నాథ్ యాత్రలో విషాదం : ఒక్కరోజే గుండెపోటుతో మృతి

Webdunia
బుధవారం, 12 జులై 2023 (17:09 IST)
పవిత్ర అమర్నాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఒక్క రోజే ఐదుగురు గుండెపోటుతో మరణించారు. గడిచిన 24 గంటల వ్యవధిలో ఐదుగురు యాత్రికులు మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. వీరి మృతికి గుండెపోటే కారణమని వారు తెలిపారు. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో జరిగే ఈ యాత్రకు వెళ్లిన వారిలో ఈ ఏడాది మృతి చెందిన వారి సంఖ్య 19కి చేరినట్టు అధికారులు వెల్లడించారు.
 
తాజాగా మృతి చెందిన ఐదుగురిలో అనంతనాగ్‌ జిల్లాలోని పెహల్గాం మార్గంలో ముగ్గురు.. గాందర్‌బల్‌ జిల్లా బల్తాల్‌ మార్గంలో ఇద్దరు ఉన్నట్టు అధికారులు తెలిపారు. మృతుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు, మధ్యప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరు ఉండగా.. ఇంకో వ్యక్తి వివరాలను గుర్తించాల్సి ఉందని తెలిపారు.
 
ఇటీవల అమర్‌నాథ్‌ యాత్ర విధులకు వెళ్లిన ఓ ఐటీబీపీ అధికారి ప్రాణాలు కోల్పోగా.. తాజాగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ యాత్ర మొదలైనప్పట్నుంచి మొత్తం మృతుల సంఖ్య 19కి చేరింది. అమర్‌నాథ్ యాత్రికులు, విధులకు వెళ్లిన భద్రతా సిబ్బంది మరణానికి కారణం అక్కడి అసాధారణ పరిస్థితులే అని అధికారులు చెబుతున్నారు. 
 
అధిక ఎత్తులో ఆక్సిజన్‌ గాఢత తక్కువగా ఉండటం వల్ల గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. మంగళవారం వరకు అమర్‌నాథ్‌ క్షేత్రాన్ని 1,37,353 మంది యాత్రికులు సందర్శించారని అధికారులు వెల్లడించారు. దక్షిణ కాశ్మీర్‌లోని హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తున ఉన్న అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్ర వార్షిక యాత్ర జులై 1 నుంచి మొదలై ఆగస్టు 31 వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments