Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేవలం 4 గంటల్లో వంతెనను నిర్మించిన ఇండియన్ ఆర్మీ

Webdunia
సోమవారం, 4 జులై 2022 (11:32 IST)
కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా అమర్నాథ్ యాత్ర సాగలేదు. ఇపుడు కరోనా వైరస్ వ్యాప్తి శాంతించడంతో రెండేళ్ళ తర్వాత అమర్నాథ్ యాత్రకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే, అమర్నాథ్ భక్తులకు జమ్మూకాశ్మీర్‌లోని ప్రతికూల వాతావరణం అనుకూలించడం లేదు. అదేసమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారత సైన్యం కంటికి రెప్పలా కాపాడుతోంది. 
 
తాజాగా, ఈ యాత్ర కొనసాగే మార్గంలో కొండచరియలు విరిగి కొట్టుకుపోయిన బల్తాల్‌ వంతెనను కేవలం 4 గంటల్లోనే పునరుద్ధరించారు. ఇటీవలే యాత్ర మార్గంలోని బల్తాల్‌ వద్ద వంతెనలు కొట్టుకుపోయాయి. కాళీమాతా ఆలయ సమీపంలోని ప్రవాహం వద్ద ఈ ఘటన జరిగింది. 
 
వంతెన కొట్టుకుపోయిన విషయాన్ని గమనించిన జవాన్లు.. వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో నిర్మాణానికి అవసరమైన కర్రలను తరలించారు. ఇంజినీర్‌ రెజిమెంట్‌కు చెందిన సభ్యులను, సాంకేతిక నిపుణులను అక్కడికి రప్పించారు. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించి కేవలం నాలుగు గంటల్లోనే అక్కడ కొత్త వంతెనను అందుబాటులోకి తెచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments