కేవలం 4 గంటల్లో వంతెనను నిర్మించిన ఇండియన్ ఆర్మీ

Webdunia
సోమవారం, 4 జులై 2022 (11:32 IST)
కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా అమర్నాథ్ యాత్ర సాగలేదు. ఇపుడు కరోనా వైరస్ వ్యాప్తి శాంతించడంతో రెండేళ్ళ తర్వాత అమర్నాథ్ యాత్రకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే, అమర్నాథ్ భక్తులకు జమ్మూకాశ్మీర్‌లోని ప్రతికూల వాతావరణం అనుకూలించడం లేదు. అదేసమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారత సైన్యం కంటికి రెప్పలా కాపాడుతోంది. 
 
తాజాగా, ఈ యాత్ర కొనసాగే మార్గంలో కొండచరియలు విరిగి కొట్టుకుపోయిన బల్తాల్‌ వంతెనను కేవలం 4 గంటల్లోనే పునరుద్ధరించారు. ఇటీవలే యాత్ర మార్గంలోని బల్తాల్‌ వద్ద వంతెనలు కొట్టుకుపోయాయి. కాళీమాతా ఆలయ సమీపంలోని ప్రవాహం వద్ద ఈ ఘటన జరిగింది. 
 
వంతెన కొట్టుకుపోయిన విషయాన్ని గమనించిన జవాన్లు.. వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో నిర్మాణానికి అవసరమైన కర్రలను తరలించారు. ఇంజినీర్‌ రెజిమెంట్‌కు చెందిన సభ్యులను, సాంకేతిక నిపుణులను అక్కడికి రప్పించారు. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించి కేవలం నాలుగు గంటల్లోనే అక్కడ కొత్త వంతెనను అందుబాటులోకి తెచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RT76: స్పెయిన్‌లో రవితేజ తో సాంగ్ పూర్తిచేసుకున్న ఆషికా రంగనాథ్

నిర్మాతలు ఆర్టిస్టులను గౌరవించడం లేదు : హీరో నరేష్

chiranjeevi : మన శంకరవర ప్రసాద్ గారు ని ఏ శక్తి కూడా ఆపలేదు...

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments