Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయ, శశికళ అక్రమాస్తుల ఫైళ్లను పరిశీలించిన గవర్నర్ విద్యాసాగర్ రావు

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఒకవైపు తన శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా జారుకుని తిరుగుబాటు నేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం గూటికి

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2017 (15:29 IST)
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఒకవైపు తన శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా జారుకుని తిరుగుబాటు నేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం గూటికి చేరుకుంటున్నారు. మరికొందరు ఆయనతో టచ్‌లో ఉన్నారు. ఇంకొందరు అజ్ఞాతంలోకి వెళ్లారు. 
 
ఇదిలావుండగా, రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు గురువారం మధ్యాహ్నం చెన్నైకు చేరుకున్నారు. ఆయనకు సీఎం పన్నీర్ సెల్వం స్వాగతం పలికారు. ఆ తర్వాత పన్నీర్‌కు సాయంత్రం 5 గంటలకు అపాయింట్మెంట్ ఇవ్వగా, రాత్రి 7.30 గంటలకు శశికళకు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. దీంతో, తనకన్నా ముందగానే గవర్నర్‌తో భేటీ అయి కొంతమేర లబ్ధి పొందాలని భావించిన శశికళ ఆశలకు గండిపడింది. 
 
మరోవైపు.. జయలలిత అక్రమాస్తుల కేసు సుప్రీంకోర్టులో విచారణకు వస్తోంది. ఈ కేసులో జయలలితతో పాటు.. శశికళ, దినకర్‌లతో మరికొందరు నిందితులు. ఈ కేసులో జయతో పాటే గతంలో ఆమె జైలు జీవితాన్ని అనుభవించారు. ఈ నేపథ్యంలో జయ, శశికళల అక్రమాస్తుల కేసుకు సంబంధించిన ఫైళ్లను గవర్నర్ పరిశీలించారన్న వార్త శశికళ శిబిరంలో కలకలం రేపుతోంది. కేసు నేపథ్యంలో, శశికి వ్యతిరేకంగా రాజ్‌భవన్ ఏదైనా నిర్ణయం తీసుకుంటుందేమో అనే భయం శశి వర్గీయుల్లో నెలకొంది. మొత్తంమీద ఇటు పన్నీర్ ఎత్తులు, గవర్నర్ అనుసరిస్తున్న వైఖరితో శశికళ శిబిరానికి ముచ్చెమటలు పోస్తున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments