Webdunia - Bharat's app for daily news and videos

Install App

ములాయం కుటుంబ విభేదాలన్నీ కేవలం డ్రామాలే : మాయావతి

ఎస్పీ ములాయం సింగ్ కుటుంబ విభేదాలన్నీ కేవలం డ్రామాలేనని బీఎస్పీ, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ యూపీ ప్రజలను సమాజ్ వాదీ పార్టీ వెర్రివాళ్లను చేస్తోందన

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2016 (10:12 IST)
ఎస్పీ ములాయం సింగ్ కుటుంబ విభేదాలన్నీ కేవలం డ్రామాలేనని బీఎస్పీ, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ యూపీ ప్రజలను సమాజ్ వాదీ పార్టీ వెర్రివాళ్లను చేస్తోందని అన్నారు. 
 
వచ్చే సంవత్సరం యూపీ ఎన్నికల్లో గూండాలను వాడుకోవాలని ఎస్పీ చూస్తోందని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే నల్లధనాన్ని వెలికితీసి ఒక్కో భారతీయుడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని బీజేపీ 2014లో ఇచ్చిన హామీని ప్రస్తావిస్తూ, ఆ హామీ ఏమైందని, బీజేపీ ప్రజలను మభ్యపెట్టి అధికారాన్ని పొందిందన్నారు. వచ్చే ఎన్నికల్లో యూపీలో తమ పార్టీయే విజయం సాధిస్తుందన్న ధీమాను మాయావతి వ్యక్తంచేశారు. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న ఎస్పీలో గత కొన్ని రోజులుగా అంతర్గత కలహాలు తారా స్థాయికి చేరిన విషయం తెల్సిందే. దీంతో తండ్రీతనయులైన ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్‌ల మధ్య పచ్చిగడ్డివేస్తే భగ్గున మండిపోతోంది. దీంతో విపక్ష పార్టీలన్నీ విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments