Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోకి ముఖేష్ అంబానీ రాజీనామా.. చైర్మన్‌గా ఆకాశ్ అంబానీ

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (19:06 IST)
Akash Ambani
టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో డైరెక్టర్ పదవికి ముఖేష్ అంబానీ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని రిలయన్స్ జియో ప్రకటించింది. రిలయన్స్ జియో చైర్మన్‌గా ఆకాశ్ అంబానీ నియమితులయ్యారు. 
 
జూన్ 27వ తేదీన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖేష్ జూన్ 27వ తేదీన అంబానీ కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసినట్లు టెల్కో తెలిపింది. 
 
2022, జూన్ 27వ తేదీ నుంచి డైరెక్టర్‌లుగా రమీందర్ సింగ్, కేవీ చౌదరిగా కొనసాగనున్నారు. ఇందుకు షేర్ హోల్డర్స్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. వీరి పదవికాలం ఐదేళ్లు. 
 
కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌లుగా పంకజ్ మోహన్ పవార్ నియామకాన్ని బోర్డు ఆమోదించింది. 2021లో నాయకత్వ మార్పుల్లో భాగంగా తన పిల్లలు బాధ్యతలు తీసుకుంటారని గతంలో అంబానీ చెప్పారు.  
 
ఆసియాలోనే అత్యంత సంపన్నులో ఒకరైన ముకేశ్ అంబానీకి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 2002లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్‌గా ముకేశ్ బాధ్యతలు చేపట్టారు.  
 
అలాగే రిలయన్స్ జియో, అదనపు డైరెక్టర్లుగా రమీందర్ సింగ్ గుజ్రాల్, కెవి చౌదరిలను నియమించడానికి కూడా బోర్డు ఆమోదం తెలిపింది. 
 
వాటాదారుల ఆమోదానికి లోబడి జూన్ 27,2022 నుంచి ఐదేళ్ల పాటు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పంకజ్ మోహన్ పవార్ నియామకానికి ఆమోదం తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments