Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో అజిత్‌ కంపెనీకి కీలక ప్రాజెక్టును అప్పగించిన భారత రక్షణ శాఖ

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2023 (12:51 IST)
కోలీవుడ్ హీరో అజిత్‌కు భారత రక్షణ శాఖ కీలక ప్రాజెక్టును అప్పగించింది. రక్షణ శాఖకు కావాల్సిన డ్రోన్లను తయారు చేసి ఇచ్చే బాధ్యతను అజిత్ సారథ్యంలోని కంపెనీకి కట్టబెట్టింది. అజిత్ సారథ్యంలో మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో ఏరోస్పేస్ ప్రయోగాలు చేసే విద్యార్థి బృందం పేరు 'దక్ష'.' అజిత్ తొలుత వారితో కలిసి డ్రోన్ ట్యాక్సీ, డ్రోన్ అంబులెన్స్‌లను తయారుచేశారు. 
 
ఎక్కువ బరువును మోస్తూ తక్కువ కాలంలో గమ్యస్థానానికి చేరే ఆ డ్రోన్ ఆస్ట్రేలియాలో జరిగిన ఓ ప్రపంచ పోటీలో రెండో స్థానంలో నిలవడం విశేషం. మనుషులు వెళ్లలేని ప్రదేశాలకు సైతం రక్తాన్నీ, ఔషధాలనూ చేరవేసే ఆ డ్రోన్లకు 2019లో దేశవ్యాప్తంగా జరిగిన డ్రోన్ ఒలింపిక్స్‌లో ప్రథమ బహుమతి వచ్చింది. 
 
కొవిడ్ సమయంలో బహిరంగ ప్రదేశాల్లో రసాయనాలు చల్లడానికి అజిత్ తన బృందంతో కలిసి సాఫ్ట్‌వేర్ ఆధారంగా పెట్రోలుతో నడిచే ఓ డ్రోన్‌ను తయారు చేశారు. ఈ డ్రోను తమిళనాడు ఉపయోగించుకుంది. దక్ష బృందం గురించి తెలిసిన భారత రక్షణ శాఖ.. నిఘా కోసం డ్రోన్లను తయారు చేయమని 'దక్ష'ను కోరింది. యేడాదిలో దాదాపు 200 డ్రోన్లను తయారు చేసే ఈ కాంట్రాక్టు విలువ రూ.170 కోట్లు. ఈ డ్రోన్‌ను భారత్ - పాక్ సరిహద్దుల్లో నిఘా, ఇతర సహాయక చర్యల కోసం వినియోగించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments