Webdunia - Bharat's app for daily news and videos

Install App

Air India: ఎయిర్ ఇండియాలో ఏసీ లేదు.. నరకం చూసిన ప్రయాణీకులు (video)

సెల్వి
సోమవారం, 19 మే 2025 (19:27 IST)
Air India
ఎయిర్ ఇండియా విమానంలో ఎక్కిన ప్రయాణీకులు నరకం ఎలా వుంటుందో చూశారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఏసీ ఫెయిల్యూర్ ఏర్పడింది. దీంతో ప్రయాణీకులు ఉక్కపోతతో చుక్కలు చూశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
వివరాల్లోకి వెళితే.. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఢిల్లీ నుంచి భువనేశ్వర్‌కు ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గురుగ్రామ్‌కు చెందిన ఓ ప్రయాణీకుడు శ్వాస సరిగ్గా ఆడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. విమానంలో ఏసీ ఫెయిల్యూర్ కారణంగా ప్రయాణీకులు గాలి లేకుండా నరకం అనుభవించారు.
 
ఎండ తీవ్రతకు తోడు ఏసీ పనిచేయకపోవడంతో ప్రయాణీకులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎయిర్ ఇండియా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అస్వస్థతకు గురైన తుషార్ కాంత్ అనే ప్రయాణీకుడు సూచించాడు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యం పట్ల క్షమాపణలు కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments