Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు ఏమయ్యారు?

ఠాగూర్
సోమవారం, 19 మే 2025 (19:15 IST)
తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట పట్టణంలోని ఖాదర్‌పుర వీధిలో నివసించే ఓ కుటుంబంలోని ఐదుగురు సభ్యులు అదృశ్యమయ్యారు. శనివారం ఉదయం నుంచి వారు కనిపించడం లేదు. ఫోన్లను ఇంట్లోనే వదిలివేసి వెళ్లారు. స్థానికులు, బంధువులు ఏదైనా ఊరికి వెళ్లారని భావించారు. కానీ, రోజులు గడుస్తున్నా వారి జాడ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
ఇంటి నుంచి కనిపించకుండా పోయిన వీరబత్తిన బాలకిషన్‌కు అప్పులు ఉన్నాయని, తనకు డబ్బులు ఇచ్చేవారు ఇవ్వకపోవడంతో వడ్డీలు కట్టలేక ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నట్టు లేఖ రాసిపెట్టారని బంధువులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
బాలకిషన్ తండ్రి జనార్ధన్, భార్య వరలక్ష్మి, కుమారుడు శ్రవణ్, కుమార్తెలు కావ్య, శిరీష కనిపించడం లేదని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... అదృశ్యమైన వారి కోసం గాలిస్తున్నారు. అలాగే, వారి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీపీ మధు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments