Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు ఏమయ్యారు?

ఠాగూర్
సోమవారం, 19 మే 2025 (19:15 IST)
తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట పట్టణంలోని ఖాదర్‌పుర వీధిలో నివసించే ఓ కుటుంబంలోని ఐదుగురు సభ్యులు అదృశ్యమయ్యారు. శనివారం ఉదయం నుంచి వారు కనిపించడం లేదు. ఫోన్లను ఇంట్లోనే వదిలివేసి వెళ్లారు. స్థానికులు, బంధువులు ఏదైనా ఊరికి వెళ్లారని భావించారు. కానీ, రోజులు గడుస్తున్నా వారి జాడ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
ఇంటి నుంచి కనిపించకుండా పోయిన వీరబత్తిన బాలకిషన్‌కు అప్పులు ఉన్నాయని, తనకు డబ్బులు ఇచ్చేవారు ఇవ్వకపోవడంతో వడ్డీలు కట్టలేక ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నట్టు లేఖ రాసిపెట్టారని బంధువులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
బాలకిషన్ తండ్రి జనార్ధన్, భార్య వరలక్ష్మి, కుమారుడు శ్రవణ్, కుమార్తెలు కావ్య, శిరీష కనిపించడం లేదని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... అదృశ్యమైన వారి కోసం గాలిస్తున్నారు. అలాగే, వారి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీపీ మధు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments