Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ - వాయుసేనకు ఇప్పటికే 60 వేలు

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (11:53 IST)
త్రివిధ దళాల్లో సైనిక బలగాల నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆరంభంలో అనేక నిరసన కార్యక్రమాలు ఆందోళనలు జరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ హింసాకాండ తర్వాత ఈ ఆందోళనపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. దీంతో అవి ఆగిపోయాయి. 
 
అదేసమయంలో నాలుగేళ్ళ పాటు సైన్యంలో సేవలు అందించేందుకు దేశ యువత అమిత ఉత్సాహం చూపుతోంది.  ఇందులోభాగంగా, ఈ అగ్నిపథ్ పథకంలో భాగంగా వాయుసేనలో నియామకాల కోసం శుక్రవారం నోటిఫికేషన్ జారీ అయింది. దీనికి మూడు రోజుల్లోనే ఏకంగా 59960 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల ఐదో తేదీతో ముగియనుంది. 
 
అప్పటికి లక్ష దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాయుసేనలో అగ్నివీర్ తొలి బ్యాచ్‌ను డిసెంబరు 11వ తేదీన ప్రకటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ యేడాది మాత్రం 23 యేళ్ల వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. agnipathvayu.cdac.in అనే వెబ్‌సైట్ ద్వారా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments