Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే : ప్లీనరీలో కాంగ్రెస్ తీర్మానం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో చర్చకు వచ్చింది. ప్లీనరీ రాజకీయ తీర్మానంలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇప్పటివరకూ

Webdunia
శనివారం, 17 మార్చి 2018 (12:56 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో చర్చకు వచ్చింది. ప్లీనరీ రాజకీయ తీర్మానంలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇప్పటివరకూ ఇవ్వకపోవడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. 
 
విభజన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసింది. అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రకటించినప్పుడు భాజపా సహా అన్ని పార్టీలు ఒప్పుకున్నాయని కాంగ్రెస్‌ గుర్తు చేసింది. ఏపీ ప్రత్యేక హోదాకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని తీర్మానంలో పేర్కొంది.
 
విభజన చట్టంలోని హామీలను ఎన్డీయే విస్మరించిందని కాంగ్రెస్‌ విమర్శించింది. తాము అధికారంలోకి వచ్చాక ఆ హామీలను అమలు చేస్తామంటూ తీర్మానం చేసింది. 2014 ఫిబ్రవరి 20న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని మన్మోహన్‌ సింగ్‌ పార్లమెంట్‌లో ప్రకటించారని కాంగ్రెస్‌ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments