Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రి కుర్చీ మినహా.... పన్నీర్ సెల్వం డిమాండ్లన్నింటికీ పళని ఓకే...!

అన్నాడీఎంకే వైరి వర్గాల విలీనానికి డీల్ కుదిరింది. ముఖ్యమంత్రి కుర్చీ మినహా మిగిలిన అన్ని డిమాండ్లకు ముఖ్యమంత్రి పళనిస్వామి సమ్మతించినట్టు సమాచారం. దీంతో మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంతో పాటు ఆయన వ

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2017 (10:16 IST)
అన్నాడీఎంకే వైరి వర్గాల విలీనానికి డీల్ కుదిరింది. ముఖ్యమంత్రి కుర్చీ మినహా మిగిలిన అన్ని డిమాండ్లకు ముఖ్యమంత్రి పళనిస్వామి సమ్మతించినట్టు సమాచారం. దీంతో మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంతో పాటు ఆయన వర్గం మెత్తపడి పార్టీలో చేరేందుకు సమ్మతించినట్టు జాతీయ మీడియా వర్గాల కథనం. గత కొన్ని రోజులుగా అన్నాడీఎంకేలో చోటుచేసుకున్న ఉత్కంఠ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెల్సిందే.
 
ఈ నేపథ్యంలో దినకరన్ అరెస్టుతో రెండు వర్గాల మధ్య అవగాహన కుదిరినట్టు తమిళ మీడియా పేర్కొంటోంది. రెండాకుల గుర్తు కోసం జాతీయ ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శశికళ మేనల్లుడు దినకరన్ అరెస్టు వరకు ఆగి, ఆ తర్వాత పార్టీని విలీనం చేయాలని పన్నీరు సెల్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
విలీనం అనంతరం ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రిగా కొనసాగనుండగా, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. అలాగే ముఖ్యమంత్రి పదవి మినహా పన్నీరు సెల్వం డిమాండ్లను కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను బుధవారం అధికారికంగా వెల్లడించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments