Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రి కుర్చీ మినహా.... పన్నీర్ సెల్వం డిమాండ్లన్నింటికీ పళని ఓకే...!

అన్నాడీఎంకే వైరి వర్గాల విలీనానికి డీల్ కుదిరింది. ముఖ్యమంత్రి కుర్చీ మినహా మిగిలిన అన్ని డిమాండ్లకు ముఖ్యమంత్రి పళనిస్వామి సమ్మతించినట్టు సమాచారం. దీంతో మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంతో పాటు ఆయన వ

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2017 (10:16 IST)
అన్నాడీఎంకే వైరి వర్గాల విలీనానికి డీల్ కుదిరింది. ముఖ్యమంత్రి కుర్చీ మినహా మిగిలిన అన్ని డిమాండ్లకు ముఖ్యమంత్రి పళనిస్వామి సమ్మతించినట్టు సమాచారం. దీంతో మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంతో పాటు ఆయన వర్గం మెత్తపడి పార్టీలో చేరేందుకు సమ్మతించినట్టు జాతీయ మీడియా వర్గాల కథనం. గత కొన్ని రోజులుగా అన్నాడీఎంకేలో చోటుచేసుకున్న ఉత్కంఠ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెల్సిందే.
 
ఈ నేపథ్యంలో దినకరన్ అరెస్టుతో రెండు వర్గాల మధ్య అవగాహన కుదిరినట్టు తమిళ మీడియా పేర్కొంటోంది. రెండాకుల గుర్తు కోసం జాతీయ ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శశికళ మేనల్లుడు దినకరన్ అరెస్టు వరకు ఆగి, ఆ తర్వాత పార్టీని విలీనం చేయాలని పన్నీరు సెల్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
విలీనం అనంతరం ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రిగా కొనసాగనుండగా, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. అలాగే ముఖ్యమంత్రి పదవి మినహా పన్నీరు సెల్వం డిమాండ్లను కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను బుధవారం అధికారికంగా వెల్లడించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments