Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నాడీఎంకే పార్టీ సీటుకి ఫీజు రూ. 25,000...

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (16:58 IST)
తమిళనాట రెండు ప్రధాన పార్టీలకూ పెద్ద తలకాయలు లేని సమయంలో ఒకవైపు రజినీ మరోవైపు కమల్‌హాసన్‌లు రాజకీయ అరంగేట్రం చేస్తూంటే, అమ్మని ఫోటోలో మాత్రమే పెట్టుకొని అమ్మ లేకుండా తొలిసారిగా ఎన్నికలలోకి అడుగిడబోతున్న అన్నాడీఎంకే దరఖాస్తు ఫీజుల పేరిట వసూళ్ల పర్వానికి తెరలేపింది.
 
తమిళనాడు, పుదుచ్చేరి నుండి లోక్‌సభ టిక్కెట్లను ఆశించే వారి నుండి దరఖాస్తులను అన్నాడీఎంకే పార్టీ ఆహ్వానించింది. అయితే ఆశావహులు దరఖాస్తు ఫీజుగా రూ.25,000 చెల్లించాల్సి ఉంటుందని ఇందుమూలంగా తెలియజేసింది. ఇందుకుగానూ ఫిబ్రవరి 4 నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయని బుధవారంనాడు అన్నాడీఎంకే కో-ఆర్డినేటర్ పన్నీర్ సెల్వం, జాయింట్ కో-ఆర్డినేటర్, ముఖ్యమంత్రి కె.పళనిస్వామిలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేసారు. 
 
కాగా తమిళనాడులో 39 లోక్‌సభ స్థానాలు ఉండగా, పుదుచ్చేరిలో ఒక లోక్‌సభ స్థానం ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే 39 లోక్‌సభ స్థానాలకు గాను 37 గెలుచుకుంది. మరి ఈసారి ఎన్ని గెలుచుకోనుందో వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments