Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యంలో నీళ్లకు బదులు యాసిడ్ కలుపుకుని తాగిన యువకుడు...

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (16:52 IST)
ఓ యువకుడు మంచినీళ్లనుకుని యాసిడ్‌ను మద్యంలో కలుపుకుని త్రాగి ప్రాణాలు కోల్పోయిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీస్ ఇన్‌స్పెక్టర్ కోటేశ్వర్‌రావు అందించిన సమాచారం ప్రకారం, కుమ్మరివాడికి చెందిన గణపతిస్వామికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండవ కుమారుడైన విజయ్‌కుమార్(26) ఆటోని నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. 
 
ఆదివారం సాయంత్రం మద్యం సీసాతో ఇంటికి వచ్చిన విజయ్ మిద్దె పైకి వెళ్లాడు, అక్కడ బాత్‌రూమ్ కిటికీపై ఉన్న యాసిడ్ బాటిల్‌ని నీళ్ల సీసాగా భావించి మద్యంలో కలుపుకుని తాగాడు. కొద్దిసేపటికి గొంతులో మంట పుట్టడంతో యాసిడ్‌గా గుర్తించాడు, గట్టిగా కేకలు పెట్టాడు.
 
ఇంట్లో ఉన్న తండ్రి అప్రమత్తమై హుటాహుటిన స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. విజయ్‌కుమార్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments