మద్యంలో నీళ్లకు బదులు యాసిడ్ కలుపుకుని తాగిన యువకుడు...

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (16:52 IST)
ఓ యువకుడు మంచినీళ్లనుకుని యాసిడ్‌ను మద్యంలో కలుపుకుని త్రాగి ప్రాణాలు కోల్పోయిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీస్ ఇన్‌స్పెక్టర్ కోటేశ్వర్‌రావు అందించిన సమాచారం ప్రకారం, కుమ్మరివాడికి చెందిన గణపతిస్వామికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండవ కుమారుడైన విజయ్‌కుమార్(26) ఆటోని నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. 
 
ఆదివారం సాయంత్రం మద్యం సీసాతో ఇంటికి వచ్చిన విజయ్ మిద్దె పైకి వెళ్లాడు, అక్కడ బాత్‌రూమ్ కిటికీపై ఉన్న యాసిడ్ బాటిల్‌ని నీళ్ల సీసాగా భావించి మద్యంలో కలుపుకుని తాగాడు. కొద్దిసేపటికి గొంతులో మంట పుట్టడంతో యాసిడ్‌గా గుర్తించాడు, గట్టిగా కేకలు పెట్టాడు.
 
ఇంట్లో ఉన్న తండ్రి అప్రమత్తమై హుటాహుటిన స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. విజయ్‌కుమార్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Virosh Reception: విరోష్ పెళ్లి రిసెప్షన్ పరిమిత ఆహ్వానితులకు మాత్రమే

దుబాయ్‌లో ప్రశాంతంగా వుంది: మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ

'ఉస్తాద్ భగత్ సింగ్' రీమేక్ మూవీ కాదు : దర్శకుడు హరీశ్ శంకర్

దుబాయ్‌లో చిక్కుకున్న సినీ తారలు.. మంచు విష్ణు ఫ్యామిలీ దుబాయ్‌లో క్షేమంగా ఉండాలి

తండ్రిని అన్‌ఫాలో చేసిన విజయ్ కుమారుడు జాసన్ విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments