Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరుణ ఇంట అప్పుడే లొల్లి.. పార్టీ క్యాడర్ అంతా అళగిరి వైపేనట..

డీఎంకే అధినేత కరుణానిధి ఇంట అప్పుడే లొల్లి ప్రారంభం అయ్యింది. కరుణ కుమారుడు అళగిరి అప్పుడే తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. కరుణానిధి మరణం తర్వాత పార్టీ బాధ్యతలను స్వీకరించేందుకు స్టాలిన్ సిద్ధమవుతున్న వ

Webdunia
సోమవారం, 13 ఆగస్టు 2018 (14:25 IST)
డీఎంకే అధినేత కరుణానిధి ఇంట అప్పుడే లొల్లి ప్రారంభం అయ్యింది. కరుణ కుమారుడు అళగిరి అప్పుడే తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. కరుణానిధి మరణం తర్వాత పార్టీ బాధ్యతలను స్వీకరించేందుకు స్టాలిన్ సిద్ధమవుతున్న వేళ, కరుణ మరో కుమారుడు అళగిరి తెరపైకి వచ్చారు. కరుణ స్మారక ప్రాంతం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. స్టాలిన్ నాయకత్వానికి సవాల్ విసిరారు. 
 
డీఎంకే కేడర్ మొత్తం తన వెనకే ఉందని, నిజమైన డీఎంకే నేతలంతా తనవైపే ఉన్నారంటూ అళగిరి సంచలన కామెంట్స్ చేశారు. అళగిరి వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీకి చెందిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కానున్న ఒక రోజు ముందే అళగిరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైనాయి. 
 
కాగా మంగళవారం కరుణానిధికి నివాళి అర్పించేందుకు డీఎంకే ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఏర్పాటు కానుంది. స్టాలిన్‌ను పార్టీ అధినేతగా ప్రకటించే జనరల్ కౌన్సిల్ సమావేశం తేదీని ఈ సమావేశంలో ప్రకటించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 1969లో అన్నాదురై చనిపోయినప్పుడు కూడా... ఇదే మాదిరి జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments