Webdunia - Bharat's app for daily news and videos

Install App

మటన్ కూర వండి పెట్టలేదని భార్యను రాడ్డుతో కొట్టి మూడో అంతస్తు నుంచి...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో దారుణం జరిగింది. ఆదివారం రోజున మటన్ కూర వండిపెట్టేందుకు నిరాకరించిందనీ భార్యను రాడ్డుతో కొట్టి తన తండ్రి, సోదరుడు సహాయంతో మూడో అంతస్తు నుంచి కిందికితోసేశాడు కసాయి భర్

Webdunia
సోమవారం, 11 జూన్ 2018 (10:24 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో దారుణం జరిగింది. ఆదివారం రోజున మటన్ కూర వండిపెట్టేందుకు నిరాకరించిందనీ భార్యను రాడ్డుతో కొట్టి తన తండ్రి, సోదరుడు సహాయంతో మూడో అంతస్తు నుంచి కిందికితోసేశాడు కసాయి భర్త. ఆ తర్వాత తన భార్య ప్రమాదవశాత్తు మూడో అంతస్తు నుంచి జారిపడిందని ఇరుగుపొరుగువారిని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, పోస్టుమార్టం రిపోర్టులో అతని బండారం బయటపడింది. దీంతో ఈ హత్యకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ జిల్లా పచ్వాన్ కాలనీకి చెందిన మనోజ్ కుమార్, రాణిలు భార్యాభర్తలు. ఐదేళ్ల క్రితం వీరికి వివాహమైంది. మనోజ్ కుమార్‌కు మద్యం సేవించే అలవాటు ఉంది. దీంతో ప్రతిరోజూ భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో ఆదివారం మద్యం సేవించి ఇంటికి వచ్చిన మనోజ్.. భార్య రాణిని మటన్ కూర వండి పెట్టాలని కోరాడు. దీనికి ఆమె నిరాకరించింది. దీంతో కోపంతో ఇనుపరాడ్డుతో కొట్టాడు. 
 
దీంతో స్పృహ కోల్పోయిన రాణిని భర్త తన తండ్రి, తమ్ముడితో కలిసి మూడో అంతస్తు నుంచి కిందకు పడేసి ప్రమాదంగా నమ్మించాడు. అయితే, తన కుమార్తె మృతిపై అనుమానం ఉందని రాణి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా అసలు విషయం తేలింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి మనోజ్‌ తండ్రి, తమ్ముడిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మనోజ్ కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments