Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ అధికారుల నిర్లక్ష్యం : మొన్న సన్నీ లియోన్.. నేడు అనుపమ

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (12:54 IST)
బీహార్ అధికారులు తమ విధులను ఎంత నిబద్ధతతో నిర్వహిస్తున్నారో ఈ సంఘటన చెపుతుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష (నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్) రాసినందుకు అభ్యర్థికి ఇచ్చే మార్కుల జాబితాలో అభ్యర్థి ఫోటోకు బదులుగా హీరోయిన్ ఫోటోను ముద్రించారు. కేరళ రాష్ట్రానికి చెందిన హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ఫోటో ఉండటం చూసిన సదరు అభ్యర్థి కాస్త ఖంగుతిన్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్‌కు చెందిన రిషికేశ్ అనే యువకుడు ఇటీవల ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (SET) రాశాడు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో అతడికి మంచి మార్కులే వచ్చాయి. కాని మార్క్ షీట్‌లో మాత్రం అత‌ని ఫొటోకి బ‌దులు వేరే వారి ఫొటో ప్ర‌త్య‌క్షం అయింది. 
 
ఆ ఫొటో మ‌రెవ‌రిదో కాదు మ‌ల‌యాళ న‌టి అనుప‌మ‌ పరమేశ్వరన్‌ది. ఈ విష‌యాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా ప‌ట్టించుకోలేద‌ట‌. అయితే ఈ మార్కుల జాబితా ఫోటో వైర‌ల్ కావ‌డంతో బీహార్ విద్యాశాఖ తీరుపై విమర్శలు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో అధికారులు స్పందించారు. ఈ తప్పిదంపై దర్యాప్తునకు ఆదేశించామని బీహార్ విద్యాశాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ తెలిపారు. 
 
కాగా, గతంలో కూడా బీహార్ ప్రభుత్వ అధికారులు ఇలాంటి తప్పులే చేశారు. ఓ విద్యార్థి దరఖాస్తు ఫారంలో.. తండ్రి పేరు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మిగా పడింది. తల్లి పేరు సన్నీ లియోన్‌గా పేర్కొన్నారు. ఇక అడ్రెస్‌ను ముంబై రెడ్ ఏరియాగా ముద్రించారు. అంతకుముందు జూనియర్ ఇంజనీర్ పరీక్షల్లో సన్నీ లియోన్‌ను టాపర్‌గా ప్రకటించారు. ఇపుడు అనుపమా పరమేశ్వరన్ ఫోటను ముద్రించి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments