Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా, లాక్ డౌన్, కొవిడ్ పేర్ల తర్వాత మగబిడ్డకు శానిటైజర్ అనే పేరు..!

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (22:14 IST)
దేశంలో ప్రధాని మోదీ జనతాకర్ప్యూ ప్రకటించిన రోజు గోరఖ్‌పూర్‌లో తల్లి ఒక ఆడబిడ్డ జన్మించగా తల్లిదండ్రులు 'కరోనా'గా నామకరణం చేశారు. మరోఘటనలో లాక్‌డౌన్‌ ప్రకటించిన ఒక వారానికి డియరియా జిల్లాలో మగబిడ్డ జన్మించగా 'లాక్‌డౌన్‌' అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. అలాగే రామ్‌పూర్‌ ప్రాంతంలో అపుడే జన్మించిన ఒక మగబిడ్డకు 'కొవిడ్‌' అని పేరుపెట్టారు. 
 
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో అప్పుడే పుట్టిన ఓ పసివాడికి శానిటైజర్ అని పేరు పెట్టారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని షహారాన్‌పూర్‌ జిల్లా విజయ్‌విహార్‌ ప్రాంతానికి చెందిన ఓంవీర్‌సింగ్‌, మోనిక దంపతులు. మోనికకు ఆదివారం నొప్పులు రావడంతో దగ్గరలోని ప్రసూతి ఆసుపత్రికి తరలించగా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలో మోనిక భర్త ఆ బుడతడికి 'శానిటైజర్‌' అనే పేరు పెట్టారు. 
 
ఈ విషయం తెలిసి.. నర్సులంతా చిరునవ్వులు చిందించారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్నవేళ పుట్టిన కారణంగా తన కుమారుడికి కరోనాను ఓడించే శక్తి ఉన్నట్టు నమ్ముతున్నానని అందుకే శానిటైజర్‌ అని పేరు పెట్టినట్టుగా చమత్కరించాడు. బంధువులందరికి ఫోన్‌ చేసి లాక్‌డౌన్‌ ముగిశాక ఘనంగా వేడుక చేద్దామంటూ చెప్పడం కొసమెరుపు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments