Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదేళ్ల సహజీవనం.. గర్భం దాల్చగానే వదిలేశాడు.. మంత్రిపై నటి శాంతిని ఫిర్యాదు

Webdunia
శనివారం, 29 మే 2021 (19:16 IST)
Shanthini
తమిళనాడు మాజీ మంత్రి ఎం మణికండన్‌పై నటి శాంతిని ఆరోపించారు. తనను పెండ్లి చేసుకుంటానని నమ్మబలికిన మణికండన్ తాను గర్భం దాల్చగానే వదిలేశాడని వెల్లడించారు. మణికండన్ తనకు బలవంతంగా అబార్షన్ చేయించడమే కాకుండా తన కుటుంబ సభ్యులను బెదిరించాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. 
 
మరోవైపు తనపై తమిళ నటి ఆరోపణలను మణికండన్ తోసిపుచ్చారు. అసలు శాంతిని ఎవరో తనకు తెలియదని అన్నాడు. ఇక మణికండన్‌పై ఆమె శుక్రవారం చెన్నైలో డీసీపీకి ఫిర్యాదు చేశారు.
 
డీసీపీకి ఫిర్యాదు చేసిన అనంతరం నటి విలేకరులతో మాట్లాడుతూ ఫిర్యాదు ప్రతిని అందించారు. తాను 2017లో అప్పటి ఏఐఏడీఎంకే సర్కార్‌లో మణికండన్ ఐటీ మంత్రిగా ఉన్న సమయంలో ఆయనను కలిశానని ఆమె చెప్పుకొచ్చారు. అప్పటికే మణికండన్‌కు వేరొక మహిళతో వివాహమైనా తనను పెండ్లి చేసుకుంటానని నమ్మబలికాడని శాంతిని ఆరోపించారు. 
 
తాము అప్పటినుంచి చెన్నైలోని బసంత్ నగర్‌లో సహజీవనం చేస్తున్నామని దీనికి సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని చెప్పారు. ఈ క్రమంలో తాను మూడుసార్లు గర్భం దాల్చినా వివాహమైన తర్వాత సంతానం కోరుకుందామని చెబుతూ అబార్షన్ చేయించాడని ఆరోపించారు. 
 
తామిద్దరం కలిసి దేశంలో పలు ప్రాంతాలు తిరిగామని అన్నారు. ఏప్రిల్ 2021లో తమ సంబంధానికి మణికండన్ దూరమయ్యాడని.. తాను చెప్పినట్లు చేయకపోతే, నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించినట్లు శాంతిని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments