Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనాభా నియంత్రణ బిల్లు పెడతామన్న రవి కిషన్.. నెటిజన్ల నెగెటివ్ కామెంట్స్

Webdunia
ఆదివారం, 24 జులై 2022 (12:33 IST)
దేశంలో జనాభా నియంత్రణపై తాను బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు నటుడు, లోక్‌సభలో బీజేపీ ఎంపీ రవికిషన్ వెల్లడించారు. ఒక జంట ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం కలిగి ఉండకుండా నిరోధించడమే దీని లక్ష్యం అని చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ, "జనాభా నియంత్రణ బిల్లు తీసుకువచ్చినప్పుడే మనం విశ్వగురువు కాగలం. జనాభా నియంత్రణ అత్యావశ్యకం. ప్రస్తుతం మనం జనాభా విస్ఫోటనం దిశగా వెళ్తున్నాం. ఈ బిల్లు ప్రవేశపెట్టేలా విపక్ష పార్టీలు సహకరించాలి. నేను ఎందుకు ఈ బిల్లు పెట్టాలనుకుంటున్నానో వినాలని కోరుతున్నాను" అంటూ ఆయన వెల్లడించారు. 
 
కేంద్రమంత్రులు కాకుండా పార్లమెంట్‌ సభ్యులు ప్రవేశపెట్టేవాటిని ప్రైవేటు బిల్లులు అంటారు. ఇప్పుడు రవికిషన్ ప్రవేశపెట్టేది కూడా ప్రైవేటు బిల్లే. మరోవైపు, ఈ బిల్లు ప్రవేశపెడతానని రవికిషన్ చెప్పగానే.. ఆయనపై నెగెటివ్ కామెంట్లు రావడం మొదలైంది. ఆయన నలుగురు పిల్లలకు తండ్రి కావడమే అందుకు కారణం. ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు. ఆడపిల్లల కంటే కుమారుడు చిన్నవాడు కావడంపైనా ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments