Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనాభా నియంత్రణ బిల్లు పెడతామన్న రవి కిషన్.. నెటిజన్ల నెగెటివ్ కామెంట్స్

Webdunia
ఆదివారం, 24 జులై 2022 (12:33 IST)
దేశంలో జనాభా నియంత్రణపై తాను బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు నటుడు, లోక్‌సభలో బీజేపీ ఎంపీ రవికిషన్ వెల్లడించారు. ఒక జంట ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం కలిగి ఉండకుండా నిరోధించడమే దీని లక్ష్యం అని చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ, "జనాభా నియంత్రణ బిల్లు తీసుకువచ్చినప్పుడే మనం విశ్వగురువు కాగలం. జనాభా నియంత్రణ అత్యావశ్యకం. ప్రస్తుతం మనం జనాభా విస్ఫోటనం దిశగా వెళ్తున్నాం. ఈ బిల్లు ప్రవేశపెట్టేలా విపక్ష పార్టీలు సహకరించాలి. నేను ఎందుకు ఈ బిల్లు పెట్టాలనుకుంటున్నానో వినాలని కోరుతున్నాను" అంటూ ఆయన వెల్లడించారు. 
 
కేంద్రమంత్రులు కాకుండా పార్లమెంట్‌ సభ్యులు ప్రవేశపెట్టేవాటిని ప్రైవేటు బిల్లులు అంటారు. ఇప్పుడు రవికిషన్ ప్రవేశపెట్టేది కూడా ప్రైవేటు బిల్లే. మరోవైపు, ఈ బిల్లు ప్రవేశపెడతానని రవికిషన్ చెప్పగానే.. ఆయనపై నెగెటివ్ కామెంట్లు రావడం మొదలైంది. ఆయన నలుగురు పిల్లలకు తండ్రి కావడమే అందుకు కారణం. ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు. ఆడపిల్లల కంటే కుమారుడు చిన్నవాడు కావడంపైనా ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments