రైలులో మహిళా కానిస్టేబుల్‌పై దాడి ... నిందితుడిపై పేలిన తూటా

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (19:53 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. రైలులో ప్రయాణిస్తున్న మహిళా కానిస్టేబుల్‌పై దాడి చేసిన నిందితుడిని యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. శుక్రవారం జరిగిన పోలీసు కాల్పుల్లో ఈ కేసులోని ప్రధాన నిందితుడు మృత్యువాతపడ్డాడు. 
 
ఈ ఘటన తర్వాత పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా, పోలీసుల కన్నుగప్పి పారిపోయేందుకు ప్రయ్నించాడు. దీంతో పోలీసులు కాల్పులు జరపడంతో మృతి చెందాడు. ఈ కాల్పులో మరో ఇద్దరు నిందితులు కూడా గాయపడినట్టు యూపీ పోలీసులు వెల్లడించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గత నెల 30వ తేదీన సరయూ ఎక్స్‌ప్రెస్‌లో ఓ మహిళా కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. సీటు విషయంలో ఆమెతో ఓ వ్యక్తి గొడవపడ్డాడు. అది కాస్త ఘర్షణగా మారి.. నిందితుడు తన స్నేహితులతో కలిసి ఆమెను తీవ్రంగా గాయపర్చాడు. అనంతరం అయోధ్య స్టేషన్‌ రాగానే వారంతా రైలు దిగి పారిపోయారు. 
 
రైలు బోగీలో రక్తపు మడుగులో స్పృహకోల్పోయి ఉన్న ఆ మహిళా కానిస్టేబుల్‌ను రైల్వే పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వాట్సప్‌లో వైరల్‌ అయిన వార్తలను సుమోటోగా స్వీకరించిన అలహాబాద్‌ హైకోర్టు.. యూపీ ప్రభుత్వం, రైల్వే పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులను గుర్తించి, అరెస్టు చేయాలని యూపీ పోలీసులను ఆదేశించింది.
 
ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక సమాచారం ఆధారంగా ప్రధాన నిందితుడిని అనీశ్‌ ఖాన్‌గా గుర్తించారు. అతడిని అరెస్టు చేసేందుకు అయోధ్యలో సోదాలు చేపట్టారు. పోలీసులను చూసిన అనీశ్, అతడి అనుచరులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎన్‌కౌంటర్‌ జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో గాయపడిన అనీశ్‌.. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసనకు సీమంత వేడుక నిర్వహించిన మెగా కుటుంబం

Fauzi: ప్రభాస్, హను రాఘవపూడి హను చిత్రానికి ఫౌజీ ఖరారు

Akhil: దీపావళి శుభాకాంక్షలతో అక్కినేని అఖిల్, జైనాబ్ రవ్జీ

James Cameron : జేమ్స్ కామెరూన్.. అవతార్: ఫైర్ అండ్ యాష్.. కోసం భారతదేశంలో ఈవెంట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments