Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూర్‌లో 3 వేలమంది కరోనా రోగులు పరారీ

Webdunia
ఆదివారం, 26 జులై 2020 (09:44 IST)
కరోనా నుంచి ప్రజల్ని కాపాడడమెలా అని మదనపడుతున్న అధికారులకు సరికొత్త తలనొప్పి ఎదురవుతోంది. అనేక మంది కరోనా పాజిటివ్ వచ్చిన వారు కనిపించకుండా పోతున్నారు. వారిని పట్టుకోవడం అధికారులకు తలకుమించిన భారంగా మారింది. ఇప్పుడు ఈ సమస్య బెంగుళూరు అధికారులను పట్టుకుంది.

కరోనా వైరస్‌ సోకిన 3,338 మంది బెంగళూర్‌లో కనిపించకుండా పోయారు. బెంగళూర్‌లో గత రోజుల వ్యవధిలోనే 27 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మొత్తం కేసుల్లో ఏడు శాతం మంది కనిపించకుండా పోవడం అధికారుల్లో ఆందోళనలను పెంచుతుంది.

వీరిని త్వరగా పట్టుకోలేకపోతే వీరి ద్వారా మరింత మందికి కరోనా విస్తరించే అవకాశముంది. తాము చాలా ప్రయత్నించినప్పటికీ వారి జాడ కనిపెట్టలేకపోయామని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు.

పరీక్షల కోసం శాంపిల్స్‌ ఇచ్చే సయమంలో కొంతమంది తప్పుడు మొబైల్‌ నెంబర్‌, తప్పుడు అడ్రస్‌ ఇచ్చారని, పాజిటివ్‌ వచ్చిందని వారికి తెలియగానే వారు కనిపించకుండా పోయారని కమిషనర్‌ మంజూనాథన్‌ ప్రసాద్‌ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments