Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూర్‌లో 3 వేలమంది కరోనా రోగులు పరారీ

Webdunia
ఆదివారం, 26 జులై 2020 (09:44 IST)
కరోనా నుంచి ప్రజల్ని కాపాడడమెలా అని మదనపడుతున్న అధికారులకు సరికొత్త తలనొప్పి ఎదురవుతోంది. అనేక మంది కరోనా పాజిటివ్ వచ్చిన వారు కనిపించకుండా పోతున్నారు. వారిని పట్టుకోవడం అధికారులకు తలకుమించిన భారంగా మారింది. ఇప్పుడు ఈ సమస్య బెంగుళూరు అధికారులను పట్టుకుంది.

కరోనా వైరస్‌ సోకిన 3,338 మంది బెంగళూర్‌లో కనిపించకుండా పోయారు. బెంగళూర్‌లో గత రోజుల వ్యవధిలోనే 27 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మొత్తం కేసుల్లో ఏడు శాతం మంది కనిపించకుండా పోవడం అధికారుల్లో ఆందోళనలను పెంచుతుంది.

వీరిని త్వరగా పట్టుకోలేకపోతే వీరి ద్వారా మరింత మందికి కరోనా విస్తరించే అవకాశముంది. తాము చాలా ప్రయత్నించినప్పటికీ వారి జాడ కనిపెట్టలేకపోయామని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు.

పరీక్షల కోసం శాంపిల్స్‌ ఇచ్చే సయమంలో కొంతమంది తప్పుడు మొబైల్‌ నెంబర్‌, తప్పుడు అడ్రస్‌ ఇచ్చారని, పాజిటివ్‌ వచ్చిందని వారికి తెలియగానే వారు కనిపించకుండా పోయారని కమిషనర్‌ మంజూనాథన్‌ ప్రసాద్‌ తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments