Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రఖ్యాత ఆర్థికవేత్త అభిజిత్ సేన్ ఇకలేరు... గుండెపోటుతో మృతి

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (11:14 IST)
ప్రఖ్యాత ఆర్థికవేత్త, ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు అభిజిత్ సేన్ తుదిశ్వాస విడిచారు. ఆయనకు వయసు 72 యేళ్లు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఆయన గుండెపోటుకు గురయ్యారు. ఆ వెంటనే ఆయన్ను ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, మార్గమధ్యంలోనే కన్నుమూసినట్టు ఆయన సోదరుడు ప్రణబ్ సేన్ వెల్లడించారు. 
 
కాగా, అభిజిత్ సేన్ ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్‌గా పని చేశారు. కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ ఛైర్మన్‌తో పాటు పలు కీలక పదవుల్లో ఆయన పనిచేశారు. 
 
ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా ఉన్న సమయంలో 2004 నుంచి 2014 వరకు అభిజిత్ సేన్ ప్రణాళికా సంఘం సభ్యుడిగా విశేష సేవలు అందించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఎంతో పట్టుకలిగిన అభిజిత్ సేన్ మృతిపట్ల పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments