Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోస్ట్‌మ్యాన్‌కు ఫోన్ కొట్టండి.. ఆధార్ లింకు చేసుకోండి..

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (10:50 IST)
భారతీయ తంతి తపాలా శాఖ మరో కొత్త సేవను అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ కార్డుకు ఫోన్ నంబరు అనుసంధాన సేవలను ప్రారంభించింది. ఇందుకోసం కేవలం రూ.50 మాత్రమే ఫీజుగా వసూలు చేయనుంది. ఈ మేరకు పోస్టల్ శాఖ హైదరాబాద్ అసిస్టెంట్ డైరెక్టర్ జె.శ్రీనివాస్ తెలిపారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఆధార్‌ కార్డుకు ఫోన్ నంబరు అనుసంధానించడానికి ఇక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనీ, పోస్టుమ్యాన్‌కు కానీ, పోస్టుమాస్టర్‌కు కానీ ఒక్క ఫోన్ చేస్తే, పోస్టాఫీసు సిబ్బంది నేరుగా ఇంటికి వచ్చి, ఆ పనిచేసి పెడతారనీ, ఇందుకు రూ.50 చెల్లిస్తే చాలని వెల్లడించారు. 
 
నిజానికి ఇప్పటివరకు ఈ సేవలను పోస్టల్ కార్యాలయాల్లో మాత్రమే అందించామని, ఇప్పుడు ఈ సేవలను ఇళ్ల వరకు విస్తరించామని పేర్కొన్నారు. మొత్తం 534 మంది పోస్టుమ్యాన్‌లు, 4156 మంది బ్రాంచి పోస్ట్‌మాస్టర్ల ద్వారా ఈ సేవలను అందించనున్నట్టు తెలిపారు. పోస్టుమ్యాన్ వద్ద ఉండే ఫోన్‌లోని ప్రత్యేక యాప్ సాయంతో ఈ సేవలు అందించనున్నట్టు వివరించారు.
 
ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 16వ తేదీ వరకు 14,675 మందికి ఈ సేవలు అందించినట్టు తెలిపారు. అయితే, ఆధార్‌ కోసం దరఖాస్తు, చిరునామా మార్పు, పుట్టిన రోజు తేదీల్లో తప్పులు వంటి వాటిని సరిదిద్దేందుకు మాత్రం పోస్టాఫీసుకు వెళ్లాల్సి ఉంటుందని శ్రీనివాస్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments