Webdunia - Bharat's app for daily news and videos

Install App

18 మందిని పెళ్లాడిన యువతి.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 21 మార్చి 2021 (10:03 IST)
తన మాయమాటలతో యువకులకు గాలం వేసి పెళ్లాడడం.. ఆపై నగదు, నగలతో పరారు కావడం.. భాగ్‌వతి అలియాస్‌ అంజలికి వెన్నతో పెట్టిన విద్య. ఇలా ఇప్పటి వరకు ఒకరి తరువాత ఒకరిని ఏకంగా 18 మందిని పెళ్లాడి వారిని మోసం చేసింది.

చివరికి రాజస్తాన్‌ పోలీసులకు చిక్కి కటకటాల పాలైంది. తెలుగు రాష్ట్రాలకు చెందినట్టుగా భావిస్తున్న అంజలి మరో ఐదుగురితో కలిసి గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో పెళ్లి పేరుతో పలువురిని మోసగించింది. జునాగఢ్‌ పరిధిలో ఉండే అంబాలియా గ్రామానికి చెందిన యువకుడిని పెళ్లాడిన అంజలి.. నగలు, రూ.3 లక్షల నగదుతో పరారైంది.

తాను మోసపోయినట్టు తెలుసుకున్న యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అంజలి బాగోతం బయటకు వచ్చింది. మారు పేరు, నకిలీ ధ్రువపత్రాలతో ఆమె గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.

అంజలితోపాటు మరో ఐదుగురిని కటకటాల వెనక్కి పంపారు. విచారణలో ఆమె 18 మంది యువకులను పెళ్లాడినట్టు చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments