Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా వైద్యురాలి గొంతు కోసి హత్య... 29 ఏళ్ల వైద్యుడే సర్జికల్ నైఫ్‌తో...

Webdunia
గురువారం, 2 మే 2019 (16:39 IST)
ఢిల్లీలోని రంజిత్ నగర్ లోని ఓ అపార్టుమెంట్లో 25 ఏళ్ల మహిళా వైద్యురాలు హత్యకు గురైంది. ఆమె శరీరంపై కత్తి గాట్లతో పాటు గొంతు కోసినట్లు వుంది. రక్తపు మడుగులో పడి వున్న ఆమె దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే... కరోల్ బాగ్ లోని ప్రభుత్వాసుపత్రిలో ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌కి చెందిన 25 ఏళ్ల గరీమ మిశ్రాతో పాటు 29 ఏళ్ల చంద్రప్రకాష్ వర్మతో పాటు మరో వైద్యుడు కలిసి ఒకే అపార్టుమెంట్లో వేర్వేరు గదుల్లో అద్దెకు వుంటున్నారు. ఐతే మే 1వ తేదీ ఉదయం గరీమా నివాసముంటున్న అద్దె గది నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పనివారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
రంగంలోకి దిగిన పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా లోపల ఆమె మృతదేహం రక్తపుమడుగులో పడి వుంది. ఆమె దేహంపై పదునైన కత్తిగాట్లు వున్నాయి. ఐతే ఆమెతో పాటుగా వుంటున్న 29 ఏళ్ల వైద్యుడు వర్మ కనిపించకపోవడంతో అతడే హత్య చేసి పరారై వుంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసి వుంటాడేమోనన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments