Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్ల కట్టలు దాచుకోవడానికి భవనాలా: మాజీమంత్రిపై చెప్పు విసిరిన మహిళ

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2022 (11:17 IST)
మాజీ మంత్రి పార్థా ఛటర్జీ పైకి ఓ మహిళ చెప్పు విసిరింది. ఈడీ కేసులో చిక్కిన పార్థా ఛటర్జీని మంగళవారం నాడు ఆసుపత్రిలో పరీక్షలు చేయించి బయటకు తీసుకువస్తున్న సమయంలో ఓ మహిళ తీవ్ర ఆగ్రహంతో తన కాలికి వున్న చెప్పును తీసి అతడిపైకి విసిరింది. తమ బిడ్డలు చదువుకుని ఉద్యోగాలు లేక రోడ్లపై తిరుగుతుంటే మీలాంటివారు కోట్లకు కోట్లు వెనకేసుకుని ఆ డబ్బంతా దాచుకునేందుకు భవనాలు కడతారా అంటూ చెప్పు విసిరింది.

 
ఐతే ఆ చెప్పు గురి తప్పడంతో పార్థా ఛటర్జీ పక్కన పడింది. ఈ పరిణామంతో అక్కడున్నవారు షాకయ్యారు. వెంటనే మాజీమంత్రిని అక్కడి నుంచి తరలించారు. కాగా రాష్ట్రంలో తనలానే ప్రజలు ఆగ్రహంతో వున్నారని ఆమె చెప్పారు. అతడిపైకి విసిరిన చెప్పున మళ్లీ ధరించబోనని ఆమె వెల్లడించారు.

 
పార్థా ఛటర్జీకి సంబంధించి ఇప్పటివరకూ రూ. 50 కోట్ల మేర నగదు, బంగారు ఆభరణాలు పట్టుబడ్డాయి. పార్థాతో పాటు ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని కూడా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments