Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మాజీ మంత్రి ఏ.రాజాకు ప్రాణాపాయం తప్పింది - ఎలాగో చూడండి (Video)

ఠాగూర్
సోమవారం, 5 మే 2025 (18:48 IST)
కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే సీనియర్ నేత, నీలగిరి లోక్‌సభ సభ్యుడు ఏ.రాజా తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆయన ఓ సభలో పాల్గొని ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ స్తంభం విరిగి పోడియంపై పడింది. దీన్ని గమనించిన ఏ.రాజా రెప్పపాటులో పరుగెత్తి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
తమిళనాడు రాష్ట్రంలో వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అధికార డీఎంకే సమాయత్తమవుతోంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సభలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా, తాజాగా మైలాడుదురైలో ఆదివారం రాత్రి ఎన్నికల సభను పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశారు. 
 
ఈ సభలో ఎంపీ రాజా ప్రసంగిస్తున్న సమయంలో గాలి దుమారం చెలరేగింది. ఆ ధాటికి వేదిక ఎదురుగా ఉన్న లైటింగ్ స్తంభం విరిగి నేరుగా పోడియంపై పడింది. అయితే, దాన్ని గమనించిన ఎంపీ రాజా వేగంగా పక్కకు తప్పుకోవడంతో ఆయన పెను ప్రమాదం తప్పింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments