Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెప్పుతో కొట్టిందని గొంతు కోశాడు, పోలీసులు వచ్చే లోగానే...

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (22:16 IST)
నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే ఓ యువకుడు 35 ఏళ్ల మహిళ గొంతు కోసి పరారయ్యాడు. స్థానికులు చెప్పిన వివరాలు ఇలా వున్నాయి.
 
పశ్చిమ బెంగాల్ కు చెందిన 35 ఏళ్ల మహిళ బెంగళూరులోని బనశంకరి పరిసర ప్రాంతాల్లో ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఈమెతో పాటు రఫిక్ అనే యువకుడు కూడా ఉపాధి నిమిత్తం వచ్చాడు. ఇతడు చీరల వ్యాపారం చేస్తూ వుండేవాడు. అతని నుంచి మహిళ గతంలో రూ. 10 వేలు అప్పుగా తీసుకుంది.
 
ఈ డబ్బు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీనితో ఆ మహిళ అతడిని చెప్పుతో కొట్టింది. ఇది జరిగి చాలా రోజులైంది. ఆ కక్షను పెట్టుకున్న రఫిక్, సోమవారం మధ్యాహ్నం రోడ్డుపై మహిళ నడిచి వెళ్తుండగా కత్తి తీసుకుని హఠాత్తుగా ఆమెపై దాడికి దిగాడు. ఈ దాడిలో ఆమె మెడపై తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే ఆమె మృతి చెందింది. నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments