Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేనుకి నీళ్లు పెడుతున్న రైతులపైకి అమాంతం దూకిన చిరుతపులి

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (16:00 IST)
ఇటీవలి కాలంలో వన్యమృగాలు అడవులను వదిలి ఊళ్లపై పడుతున్నాయి. తెలంగాణలో ఆమధ్య పెద్దపులి ఇద్దర్ని పొట్టనపెట్టుకుంది. కర్నాటకలోనూ చిరుతపులుల దాడులు ఎక్కువయ్యాయి. తాజాగా ఓ చిరుతపులి చేను నీళ్లు పెట్టుకుంటున్న రైతులపై మెరుపుదాడి చేసింది.
 
కర్నాటక రాష్ట్రంలోని హవేరి జిల్లా బులపురలో గాడిగెప్ప, క్రిష్ణప్ప అనే ఇద్దరు రైతులు వేకువజామున 3 గంటలకు పొలంకి నీరు పెట్టేందుకు వెళ్లారు. వారు నీళ్లు పెడుతున్న సమయంలో వెనుక నుంచి హఠాత్తుగా ఇద్దరి రైతులపైకి దూకి దాడి చేసింది. చిరుత నుంచి తప్పించుకునేందుకు ఇద్దరు రైతులు తీవ్రంగా పోరాడారు.
 
పక్కనే వున్న పెద్ద బండరాయితో చిరుతపై దాడి చేసి హతమార్చారు. చిరుత దాడిలో గాడిగెప్పకు తీవ్ర గాయాలు కావడంతో అతడిని చిత్రదుర్గ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్రిష్ణప్పకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా వేసవి కావడంతో వన్యప్రాణులు ఊళ్లవైపు వచ్చే అవకాశం వుందనీ, అటవీ ప్రాంతాలకు సమీపంలో వున్న ప్రజలు అప్రమత్తంగా వుండాలని అటవీశాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మంచినీటి కోసం జంతువులు రావచ్చనీ, ఊరి బయట జంతువులకు నీటి తొట్టెలను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రజలను కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments