Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాటలు వింటున్న బాలికపై చిరుత దాడి, అడవిలోకి లాక్కెళ్లి...

Webdunia
సోమవారం, 8 జూన్ 2020 (22:52 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అటవీ ప్రాంతానికి సంబంధించిన కనాకౌన్ గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక తన ఇంటి సమీపంలో పెరటి తోటలో చెవిలో హెడ్ ఫోను పెట్టుకుని పాటలు వింటోంది. ఈ సమయంలో అక్కడికి చిరుతపులి ప్రవేశించింది. పులి రాకను ఆ బాలిక గమనించలేదు. దీనితో అది ఆమెపై దాడి చేసి నోట కరచుకుని అటవీ ప్రాంతంలోకి ఎత్తుకెళ్లి చంపేసింది. 
 
బాలికను పులి ఎత్తుకెళ్లిందన్న సమాచారాన్ని అందుకున్న అటవీ అధికారులు సమీపంలో గాలించారు. తీవ్ర గాలింపు అనంతరం ప్రక్కనే వున్న ముళ్లపొదలో ఆమె శవాన్ని గుర్తించారు. బాలిక చెవిలో హెడ్ ఫోన్ వుండటం వల్ల చిరుత రాకను గుర్తించలేకపోయి వుంటుందని, అందువల్లనే ఈ ప్రమాదానికి కారణమై వుండవచ్చని వారు తెలిపారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
 
బాలిక కుటుంబ సభ్యులకు యూపీ సీఎం సానుభూతి తెలిపారు. కాగా గత నెల రోజుల కాలంలో చిరుతపులి 8 మందిని పొట్టనబెట్టుకుంది. ఈ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు పలుచోట్ల వలలు వేశారు. ఐనప్పటికీ చిరుత ఇప్పటివరకూ పట్టుబడలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments