Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆరుగురితో పెళ్లి.. ఏడోసారి జంప్

Webdunia
గురువారం, 3 జనవరి 2019 (14:34 IST)
ఓ కిరాణా కొట్టు యజమాని ఆరుగురు మహిళలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏడవ సారి ఓ అమ్మాయితో జంప్ అయ్యాడు. ఈ ఘటన తమిళనాడు, దిండుక్కల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  దిండుక్కల్, తెన్నంపట్టి ప్రాంతానికి చెందిన మురుగన్.. ఓ కిరాణా కొట్టు యజమాని. ఇతడు ఆరుగురిని ప్రేమ పేరుతో మోసం చేసి వివాహం చేసుకున్నాడు. 
 
ఆరోసారిగా రాధ అనే మహిళను పెళ్లాడాడు. పెళ్లైన కొద్దిరోజులకు వీరి వివాహం సజావుగా సాగింది. వీరికి ఓ అబ్బాయి పుట్టాడు. రాధ రెండోసారి గర్భం దాల్చింది. కానీ ‌మురుగన్‌కున్న అప్పులతో ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో మురుగన్ కొద్ది రోజుల క్రితం కనిపించకుండాపోయాడు. భర్త కనిపించకపోవడంతో రాధ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
రాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో పోలీసులకు షాకయ్యే వివరాలు వెలుగులోకి వచ్చాయి. మురగన్ ఐదుగురు మహిళలను వివాహం చేసుకుని మోసం చేశాడని, ఆరో భార్య రాధను వదిలి ఏడోసారిగా ఓ అమ్మాయితో లేచిపోయాడని తెలిసింది. దీంతో తాను మోసపోయాననే వార్తవిని ఆ గర్భిణిగా వున్న రాధ షాకైంది. పరారీలో వున్న మురుగన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments