Webdunia - Bharat's app for daily news and videos

Install App

Balloon : బెలూన్ మింగేసిన ఏడు నెలల శిశువు.. ఊపిరాడక ఆస్పత్రికి తరలిస్తే?

సెల్వి
బుధవారం, 5 మార్చి 2025 (16:24 IST)
Balloon
తమిళనాడు, తంజావూరు సమీపంలో బెలూన్ మింగడంతో ఏడు నెలల శిశువు ఊపిరాడక మరణించిన విషాద సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి తంజావూరు జిల్లాలోని ఒరతనాడు సమీపంలోని తిరువోనం తాలూకా ఊరనిపురం గ్రామానికి చెందిన సతీష్‌కుమార్, శివగామి దంపతుల 7 నెలల పసికందు అకస్మాత్తుగా శ్వాస ఆడక ఇబ్బందికి గురైంది. 
 
దీంతో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు ఆ బిడ్డను పట్టుకోట్టై ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ బిడ్డను పరీక్షించిన వైద్యులు అప్పటికే బిడ్డ చనిపోయిందని నిర్ధారించారు. బిడ్డ మృతిపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు చిన్నారి మృతదేహాన్ని శవపరీక్ష కోసం తంజావూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
 
తంజావూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రి వైద్యులు నిర్వహించిన శవపరీక్షలో చిన్నారి శ్వాసనాళంలో బెలూన్ ఇరుక్కుపోయిందని తేలింది. ఆ బెలూన్‌ను మింగడంతో ఊపిరాడక చిన్నారి చనిపోయిందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఆడుకునే బొమ్మలపై చాలా శ్రద్ధ వహించాలని, అలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించాలని వైద్యులు సూచించారు.
 
ఈ సంఘటనపై తిరువోణం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఆ చిన్నారి తల్లిదండ్రులను విచారించారు. ఆ పిల్లవాడు బెలూన్‌ను ఎలా మింగిందనే దానిపై దర్యాప్తు జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

ప్రేమించడం లేదా అన్నది తన వ్యక్తిగతం : సమంత

Samantha: ఇంకోసారి ప్రేమలో పడి ఆలోచనే సమంతకు లేదా? జెస్సీ రోల్ అంటే చాలా ఇష్టం

నిర్మాతల కష్టాలను హీరోలు పట్టించుకోవడం లేదు : దిల్ రాజు

సందీప్ రెడ్డి వంగా ఆవిష్కరించిన సంతాన ప్రాప్తిరస్తు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

తర్వాతి కథనం
Show comments