భగత్ సింగ్ నాటకం రిహార్సల్ చేస్తుండగా.. ఫ్యాన్‌కు ఉరేసుకుని..?

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2022 (18:19 IST)
భగత్ సింగ్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు.. ఆయనపై జరుగుతున్న ఓ నాటకం కోసం రిహార్సల్ చేస్తుండగా.. ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన నాగరాజ్ గౌడ, భాగ్యలక్ష్మి దంపతులు తిప్పాజీ సర్కిల్‌లో చిన్నపాటి హోటల్ నడుపుతుంటారు. వీరికి సంజయ్ అనే కుమారుడు వున్నాడు. 
 
బదవానెలోని ఓ స్కూల్‌లో ఏడవ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సంజయ్‌ను ఇంట్లో ఉంచి నాగరాజ్, భాగ్యలక్ష్మీ హోటల్‌కు వెళ్లిపోయారు. అయితే ఇంటికొచ్చి చూసేసరికి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్న సంజయ్ కనిపించాడు. కిందికి దింపి పరీక్షించగా అప్పటికే ప్రాణం పోయిందని తేలింది. 
 
స్కూలులో త్వరలో జరగబోయే వేడుకలలో పాల్గొనేందుకు భగత్ సింగ్ నాటకాన్ని సంజయ్ ప్రాక్టీస్ చేస్తున్నాడని తండ్రి నాగరాజ్ చెప్పారు. ఆ రోజు ఆదివారం కావడంతో ఇంట్లోనే ఉన్న సంజయ్.. ఉరి వేసుకునే సీన్‌ను ప్రాక్టీస్ చేస్తూ ప్రమాదవశాత్తూ చనిపోయి ఉంటాడని నాగరాజ్ చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని మదం తో ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments