Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ల్యాప్‌టాప్ చోరీ చేసిన దొంగ.. ఇంటికెళ్ళి సారీ చెపుతూ మెయిల్

laptop thief
, సోమవారం, 31 అక్టోబరు 2022 (14:07 IST)
ఓ దొంగ ఓ ఇంట్లోకి చోరీకి వచ్చి ల్యాప్‌టాప్ చోరీ చేశాడు. ఆ తర్వాత ఇంటికెళ్లి సారీ చెబుతూ మెయిల్ పెట్టాడు. మరోదారి లేక దొంగతనం చేశానంటూ వివరణ ఇచ్చాడు. లాప్‌టాప్‌లోని ముక్యమైన ఫైల్స్‌ను పంపించాడు. ఈ మెయిల్‌ చూసిన ల్యాప్‌టాప్‌ యజమాని సంతోషించాలో.. బాధపడాలో తెలియట్లేదంటూ వాపోయాడు. 
 
"ఆర్థిక కష్టాల్లో ఉన్నాను... మరోదారి కనిపించక మీ ల్యాప్ టాప్ చోరీ చేయాల్సి వచ్చింది. నన్ను క్షమించండి" అంటూ దొంగ సదరు ల్యాప్‌టాప్ యజమానికి మెయిల్ చేశాడు. అంతేకాకుండా, ల్యాప్‌టాప్‌లో ఉన్న పరిశోధన పత్రాలను పంపించి ఇంకా ఏమైన ముఖ్యమైన ఫైల్స్ ఉంటే చెప్పండి పంపించేస్తా అని అడిగాడు. దీంతో ల్యాప్‌టాప్‌ పోయినందుకు బాధపడాలో లేక కష్టపడి చేసిన పరిధోనకు సంబంధించిన ఫైల్స్ దక్కించుకునందుకు సంతోషించాలో తెలియట్లేదని ఆ యువకుడు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కాస్త వైరల్ అయింది. 
 
దొంగతనం చేస్తే చేశాడు కానీ విలువైన ఫైల్స్ పంపించాడు. ఎంతైనా మంచి దొంగేనని నెటిజన్లు కితాబిస్తున్నారు. జ్వైల్లీ థిక్సో అనే ట్విట్టర్ యూజర్ ఈ వివరాలను ట్వీట్ చేశాడు. "నిన్న రాత్రి నా ట్యాప్‌ టాప్‌ను ఎంతో దొంగిలించారు. ఈ రోజు ఉదయం నా మెయిల్ ఐడీ నుంచే నాకు మెయిల్ వచ్చింది. 
 
తెరిచి చూస్తే "నిన్న మీ ల్యాప్ టాప్‌ను ఎత్తుకెళ్లింది నేనే. చాలా కష్టాల్లో ఉన్న నాకు మరో దారి కనిపించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ పని చేయాల్సి వచ్చింది. ఇక ల్యాప్‌టాప్‌లో మీరు దాచుకున్న రీసెర్స్ ఫైల్స్‌ను ఈ మెయిల్‌తో పంపిస్తున్నా. లాప్ టాప్‌లో ఇంకా ఏమైనా ముఖ్యమైన ఫైల్స్ ఉంటే చెప్పండి. మీకు పంపించేస్తా. అయితే సోమవారం లోపే అడగండి. ఆ తర్వాత ఈ ల్యాప్ టాప్ నా దగ్గర ఉండదు అని ఉందని థిక్సో చెప్పాడు. పైగా, దొంగ పెట్టిన మెయిల్స్‌ను ల్యాప్‌టాప్ యజమాని స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్‌లో షేర్ చేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేబుల్ వంతెన కూలిన ఘటనలో బీజేపీ ఎంపీ కుటుంబీకులు 12 మంది మృతి