Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం - 9 మంది దుర్మరణం

Webdunia
గురువారం, 19 జనవరి 2023 (12:56 IST)
మహారాష్ట్రలోని రాయగఢ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. ముంబై - గోవా రహదారిపై గురువారం ఉదయం 4.45 గంటలకు లారీ -  కారును ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వ్యానులో ఉన్నవారంతా బంధువులే కావడం గమనార్హం. వీరంతా కలిసి రత్నగిరి జిల్లాలోని గుహాగర్‌కు బయలుదేరారు. 
 
ఆ సమంయలో ముంబై వెళుతున్న లారీ ఒకటి కారును ఢీకొట్టింది. దీంతో ఒక బాలిక, ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు అక్కడికక్కడే చనిపోయారు. మరో నాలుగేళ్ల బాలుడు గాయపడ్డారు. అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సివుంది. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments