Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో 8వేల మార్కును దాటిన కరోనా కేసులు.. రైళ్లు వద్దు సార్..

Webdunia
సోమవారం, 11 మే 2020 (20:21 IST)
తమిళనాడులో కరోనా వైరస్ తీవ్రత రోజు రోజుకీ పెరిగిపోతోంది. రోజురోజుకు కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. సోమవారం కొత్తగా మరో 798 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8 వేల మార్కును దాటి 8,002కు చేరింది.

ఇక సోమవారం కొత్తగా మరో ఆరుగురు కరోనా బాధితులు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 53కు చేరింది. మొత్తం కేసులలో 2,051 మంది వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 5,895 మంది వివిధ ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు.
 
ఇదిలా ఉంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో తమిళనాడు సీఎం పళనిసామి కీలక సూచన చేశారు. తమిళనాడు రాష్ట్రానికి మే 31 వరకు రైళ్లు నడపవద్దని, రైళ్ల రాకపోకలకు అనుమతి ఇవ్వవద్దని విజ్ఞప్తిచేశారు. ఇంకా విమాన రాకపోకలకు కూడా అనుమతి ఇవ్వవద్దని కోరారు.

ఇలా చేయడం ద్వారా కరోనా కేసుల సంఖ్యను తగ్గించవచ్చునని.. కొత్త కేసులు నమోదు కావన్నారు. ఇక ప్రధాని కూడా పళనిసామి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments