Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ ఇలా ఎందుకు చేశారంటూ కె.ఎ. పాల్ ప్రశ్న

Webdunia
సోమవారం, 11 మే 2020 (19:43 IST)
ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్. తిండిలేక జనం అల్లాడుతుంటే మద్యాన్ని ప్రభుత్వం విక్రయించడం ఏమిటో అర్థం కాలేదన్నారాయన. సిఎం జగన్ ఎందుకు ఇలా చేస్తున్నాడని ప్రశ్నించారు. అసలు జగన్‌కు ఆలోచించే శక్తి ఉందా అంటూ ప్రశ్నించారాయన.
 
నేను సిఎంను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని మద్యం అడిగారా... కరోనా విపత్తు సమయంలో జనం కడుపునిండా తిండి అడుగుతున్నారు. సామాన్యుల పరిస్థితి హీనంగా తయారైంది. కాబట్టి వారిని ఆదుకోవాలి. ఇప్పటికీ ఆకలిచావులు కొనసాగుతున్నాయి. ఎంతోమంది అర్థాకలితో మరణిస్తున్నారు కూడా.
 
అందుకే ఈ వైన్ షాపులను మూసివేయాలని కోరుతున్నాను. ఇప్పటికైనా జగన్ ఆలోచించాలి. ముఖ్యమంత్రి హోదాలో ఆయన నిర్ణయాలన్నీ ఉండాలి అంటూ కె.ఎల్.పాల్ సున్నితంగా విమర్శించారు. గ్రామాల్లోను, మారుమూల ప్రాంతాల్లోను దుర్భరమైన పరిస్థితిని కొంతమంది అనుభవిస్తున్నారు. వారి దగ్గరికి వెళ్ళండి, వారిని కాపాడండి, వారికి చేతనైన సాయం చేయండి అంటూ కోరారు కె.ఎ.పాల్. ఎప్పుడూ కె.ఎ.పాల్ విమర్సించే నెటిజన్లు ఆయన తాజాగా విడుదల చేసిన వీడియోను చూసి ఏమంటారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments